టిఆర్ఎస్ పాలన మీద చార్జిషీట్ విడుదల చేసిన బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ… 2014 లో సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృధా చేశారు. ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట కు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంత మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా గా మారింది. 12 వేల మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుకు దరఖాస్తు పెట్టుకుంటే కేవలం రెండు వేల మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా పని చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాత్రికి రాత్రి రోడ్లను నిర్మించారు. అమృత్ పథకం కింద నిధులు దుర్వినియోగం అయ్యాయి. 2023 లో కేసీఆర్ ను ఇంటికి పంపి, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు.