కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ గా గెలిచిన వ్యక్తి కరీంనగర్ కి ప్రత్యేకంగా ఒక్క పైసా తెచ్చావా? అని ప్రశ్నించిన ఆయన అభివృద్ధి లో మాతో పోటీ పడు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు,ప్రాజెక్టు లకు ప్రత్యేక హోదా తీసుకొని రా అని అన్నారు. చిల్లర మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నాగార్జున సాగర్ టిఆర్ఎస్ గెలుస్తాది…బీజేపీ అభ్యర్థి కి డిపాజిట్ గల్లంతవుతుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తాది అని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ అభివృద్ధి విషయంలో పోటీ పడదం. పార్లమెంట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకురా అని సూచించారు.