ఉన్నత విద్యాశాఖ అధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ నివారణ పద్ధతులపై, వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన పెంచడానికి జాతీయ సేవా పథకం, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్ లకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో, ప్రజలలో మంచి అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తెలిపారు. ప్రజలు సరైన విధంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, గుంపులుగా గుమికూడకుండా ఉండటం ఇలాంటివి కోవిడ్ నివారణ, నియంత్రణలో అత్యంత కీలకమని డాక్టర్ తమిళి సై స్పష్టం చేశారు. ప్రజా చైతన్యంతోనే కోవిడ్ లాంటి మహమ్మారిని నిరోధించగలమని, ప్రజల ప్రాణాలను కాపాడగలమని ఆమె అన్నారు.
ప్రతి విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ దిశగా తగు జాగ్రత్తలతో వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు. మనము ఎన్ని వెంటిలేటర్లు తయారుచేసిన, ఎన్ని మంచి మందులు తయారుచేసిన, ఆక్సిజన్ సప్లై పెంచినప్పటికీ చైతన్యవంతమైన ప్రజలే సరైన ముందు జాగ్రత్తలతో కోవిడ్ నివారించ గలరని డాక్టర్ తమిళిసై వివరించారు. కోవిడ్ బారిన పడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది యువకులే ఉండడం బాధను కలిగిస్తుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ లు తమ తమ యూనివర్సిటీలలోని విద్యార్థులతో, వాలంటీర్లతో సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల ద్వారా మంచి చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాలని, వినూత్న పద్ధతులు అవలంబించేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
Also Read
ప్రతి విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని , ఈ దిశగా అధికారులు అందరూ శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వచ్చే నెల ఒకటవ తారీఖు నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్న దృష్ట్యా అర్హులైన అందరు విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలి అని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!