హైదరాబాదులో ప్రత్యేక డ్రైవ్ ఇన్ పరీక్షా కేంద్రాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్న పరీక్షా కేంద్రాలు నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా సేవలు అందించలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాధి నిర్థారణలో కీలకమైన కోవిడ్-19 ఆర్ టి పీసీయార్ (ఐసియంఆర్ వారి అనుమతులకనుగుణంగా) పరీక్షలకు వారికి అందించడానికై వీలుగా అపోలో డయాగ్నస్టిక్స్, అపోలో హెల్త్ మరియు లైఫ్ స్టైల్ లిమిటెడ్ వారి డయాగ్నస్టిక్ విభాగం వారు హైదరాబాదులో ప్రత్యేకమైన డ్రైవ్ ఇన్ పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. తద్వారా వందలాది మంది పౌరులకు త్వరిత గతిన కరోనా చికిత్స అందించడానికి వీలు కలుగనుంది. ఇలా నెలకొల్పబడుతున్న పరీక్షా కేంద్రాలలో రోజూ 250 మంది పేషెంట్ల వరకూ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించగలిగే సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
హైదరాబాదులో మొట్ట మొదటి సారిగా నెలకొల్పబడుతున్న ఈ డ్రైవ్ ఇన్ కరోనా పరీక్షా కేంద్రాన్ని మెరిడియన్ స్కూలు, మాదాపూర్ లో నేడు శుక్రవారం 23 ఏప్రియల్ నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా ప్రధానంగా గచ్చిబౌలి, కూకట్ పల్లి, మాదాపూర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మరియు కొండాపూర్ వాసులకు సేవలు అందిస్తుంది. ఈ పరీక్షా కేంద్రానికి వచ్చే వారు మెరిడియన్ స్కూలు, గేట్ నెం.2 (మాదాపూర్ బ్రాంచ్) వద్ద నుండి రావాల్సి ఉంటుంది.
Also Read
ఈ పరీక్షా కేంద్రానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరమైన ఐదు అంశాలతో కూడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది.
1) పరీక్షా కేంద్రానికి వచ్చే వారు తమ నమోదు కార్యక్రమాన్ని మొబైల్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా చేసిన వెంటనే వారి మొబైల్ లో టోకెన్ అందుకోవడం జరుగుతుంది.
2) టోకెన్ అందుకొన్న తర్వాత పరీక్ష చేయించుకోదలచిన వారు తగిన రుసుము ఆన్ లైన్ లోనే చెల్లించి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
3) టోకెన్ నెంబర్ ఆధారంగా ఫెల్భొటోమిస్టు (పరీక్ష నిర్వహించే నిపుణులు) నమూనాలను సేకరిస్తారు.
4) నమూనాను సేకరించిన వెంటనే పరీక్ష చేయించుకొన్న వారి మొబైల్ లో వివరములతో పాటూ బిల్లు కూడా మెసేజ్ ద్వారా అందుతాయి. పరీక్షకు వచ్చే వారు తమతో పాటూ ప్రభుత్వం పేర్కొన్న విధంగా తగిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ) ను తమ వెంట తెచ్చుకోవాలి.
5) పరీక్షానంతరం అపోలో డయాగ్నస్టిక్స్ వారు 48-72 గంటలలోగా రిపోర్టును ఆన్ లైన్ లోనే అందించడం జరుగుతుంది.
ఈ ప్రక్రియ అంతా మానవ రహితంగా మొత్తం ఆన్ లైన్ లోనే సాగుతుంది. ఈ పరీక్షా కేంద్రాల వివరాలను ఎప్పటికపుడు ఆపోలో డయాగ్నస్టిక్స్ వారి వెబ్ సైట్ (www.apollodiagnostics.in) లో ఉంచడం జరుగుతుంది.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!