2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు..? ఏమైంది : ఎంపీ అరవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గతంలో 2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు. ఇప్పుడు వరి వేయోద్దని అంటున్నారు. దీనిలో ఆంతర్యం ఏంటని ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని కేంద్రం చెప్పిందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ పెంచుకుంటే కేంద్రం 80శాతం సబ్సీడీ ఇస్తుందన్నారు. వరి అమ్మకపోతే గంజాయి విత్తనాలు అమ్మాలా..? అంటూ అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ అరవింద్ అన్నారు. ఏ పంట వేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
Also Read
- Tags
- bjp
- Dharmapuri Aravind
- kcr
- rice
- TRS
తాజావార్తలు
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!