ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 37,765 సాంపిల్స్ ని పరీక్షించగా.. 5963 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 27 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,569 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 సాం పిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,68,000 కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 48,053 గా ఉన్నాయి.. ఇప్పటి వరకు 9,12,510 మంది రికవరీ కాగా.. 7,437 మంది కోవిడ్తో మృతిచెందారు.