Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..
- మహిళకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్.
- భర్త అత్తామామలే నిందితులు.
- పోలీసులు కేసు నమోదు దర్యాప్తు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పూణే నగరంలోని కిడ్నాప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై పూణే మహానగరంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తో పాటు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. మహిళని కారులో ఎక్కించే సమయంలో ఎవరు కూడా స్పందించలేకపోయారు. ఇక ఈ ఘటన మొత్తం జరుగుతున్న పక్కనే ఉన్న హోటల్లో అమర్చిన సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే., ఆ మహిళల కిడ్నాప్ చేసింది మరెవరో కాదు.. ఆమె భర్త అత్తమామలే. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Lavanya Tripati : మెగా కోడలు లేటెస్ట్ లుక్ చూశారా..?
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ప్రింబ్రి – చించివాడ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆమె భర్త అత్తమామలు ఆమెకు మత్తుమందు ఇచ్చి లాకెళ్ళారు. మధ్యాహ్న సమయం 3:15 నిమిషాల సమయంలో ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన ఆ మహిళను సుమిత్ షహనే అనే వ్యక్తి, అతని తల్లిదండ్రులు మత్తుమందు ఇచ్చి అనంతరం ఆమెను రోడ్డుపై ఇచ్చుకుంటూ లాకెళ్లి కారులో ఎక్కించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారందరూ కారులో వెళ్లిపోయారు.
Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..
అలా వెళ్ళిన తర్వాత ఓ గుడి వద్ద కారు ఆగింది. ఆ సమయంలో కారులోని కిడ్నాప్ అయిన మహిళ పెద్దగా కేకలు వేయడంతో కేకలు విన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో., వెంటనే పోలీసులు ఆ విషయంపై స్పందించారు. తనకి సంబంధించిన కొన్ని ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టేందుకు వారు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని, అలాగే తనకి మత్తు మందు ఇచ్చారని కూడా మహిళ పోలీసులకు తెలియజేసింది. కిడ్నప్ కు గురైన మహిళకు 2023లో వివాహం జరగగా.. తర్వాత మూడు నెలలకే వారి సంసారంలో విభేదాలు రావడంతో ఆవిడ అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Woman Sedated, Dragged, Kidnapped By Husband, In-Laws in Broad Daylight in Pune! Incident caught on camera pic.twitter.com/umOeYgOxCq
— Sneha Mordani (@snehamordani) June 22, 2024
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!