అమరావతి మహాసభపై వైసీపీ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతు మహాసభ జరిగింది. ఈ సభకు ప్రతిపక్షాలు హాజరయ్యాయి. కాగా, అమరావతి సభపై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగిన కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.
Read: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం… అది రైతుల ఉద్యమం కాదు…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
బీజేపీ నేతలు స్కాం అని చెప్పి ఎలా అమరావతి సభకు హాజరయ్యారని ప్రశ్నించారు. కమ్యునిస్టు పార్టీలు కూడా క్యాపిటలిస్టు పార్టీలకు ఎలా మద్దతు పలుకుతారని అన్నారు. త్వరలోనే మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడతామని అన్నారు. తిరుపతిలో జరిగిన సభ పనికిమాలిన సభ అని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని అన్నారు. అటు పవన్పై కూడా అమర్నాథ్ రెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ బుద్ది లేకుండా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, రాజకీయ సిద్దాంతం లేని వ్యక్తి పవన్ అని తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..