జగనన్న బాణం.. నిజంగానే ఒంటరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది.
ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని.. ఆ సమయంలో.. వైఎస్ విజయమ్మ ప్రతి సందర్భంలో తన కుమారుడికి అండగా నిలిచి.. ముందుకు తీసుకువెళ్లారని వైఎస్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా.. తెలంగాణ రాజకీయ బరిలో దిగిన షర్మిలకు వైఎస్ సహచరి విజయమ్మ తోడుగానే నిలుస్తున్నారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
విజయమ్మ తోడుగా నిలిస్తే.. వైఎస్ఆర్ తోడుగా ఉన్నట్టే అని షర్మిలకు ఆమె సహచరులు సైతం ధైర్యం చెబుతున్నారట. అంతే కాకుండా.. తెలంగాణ రాజకీయాలను వద్దనుకున్నారు కాబట్టి.. జగన్.. ఈ విషయంలో పట్టించుకోవడం లేదని.. ఏపీ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఓ అన్నగా ఆయన మాట్లాడినప్పుడు కచ్చితంగా తన అభిప్రాయాలు చెప్పి తీరతారని.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో.. షర్మిల సైతం ఓ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ రాజకీయాలు చేస్తున్నాయి. వారితో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని.. కాంగ్రెస్, బీజేపీ శక్తులను దాటి.. తెలంగాణలో వేళ్లూనుకోవాలంటే.. షర్మిల కచ్చితంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది.
ఆ దిశగా కూడా.. ఆమె ఆలోచన చేస్తే.. షర్మిల ఎప్పటికీ ఒంటరి కాబోదని.. ఆమె శక్తికి సైతం ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న కాలంలో అయినా కాస్త ప్రభావాత్మకత అన్నది చేకూరుతుందని తెలంగాణలోని వైఎస్ అభిమానులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!