Uttarakhand: చార్ధామ్ యాత్రలో కరోనా గ్రహణం?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డెహ్రాడూన్లో గరిష్టంగా కరోనా వైరస్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు రోగులు కూడా చనిపోతున్నారు. ఐదుగురు రోగులు ప్రస్తుతం డూన్ ఆసుపత్రిలో ఐసియులో చేరారు. ఒక్క డెహ్రాడూన్లోనే 21 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. డెహ్రాడూన్ జిల్లాలో జనవరి నుండి ఇప్పటి వరకు 165 మంది కరోనా బారిన పడ్డారు.
చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతున్న సమయంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. చార్ధామ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో వైరస్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంది.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
చార్ధామ్ను సందర్శించే యాత్రికులు కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని యాత్రికులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, కోవిడ్ పరీక్షల పరిధిని పెంచడానికి ప్రభుత్వం కఠినమైన సూచనలు కూడా ఇచ్చింది.
Also Read:India VS China: అరుణాచల్లోని ప్రాంతాలకు చైనా పేర్లు.. డ్రాగన్ చర్యను తిరస్కరించిన భారత్
పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ దృష్ట్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ విధానసభలో ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చార్ ధామ్ యాత్ర-2023 దృష్ట్యా, యాత్ర మార్గంలో కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్లో కోవిడ్ పరీక్షలను పెంచాలని ఆరోగ్య మంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు.
Also Read:Mumbai: లోకల్ ట్రైన్ను ఎక్కనివ్వనందుకు కోపం.. ప్రయాణికులు ఏం చేశారంటే..
ఉత్తరాఖండ్లో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ను పెంచాలని ఆరోగ్య మంత్రి డాక్టర్ రావత్ ఆరోగ్య అధికారులను కోరారు. చార్ ధామ్ యాత్ర మార్గాల్లోని అన్ని మెడికల్ యూనిట్లు మరియు తాత్కాలిక మెడికల్ రిలీఫ్ పాయింట్లను అక్కడికక్కడే తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించాలని ఆరోగ్య మంత్రి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ను ఆదేశించారు. అంతే కాకుండా ఏప్రిల్ 15లోపు చార్ ధామ్ యాత్రలో స్పెషలిస్ట్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కోసం శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి ధన్ సింగ్ రావత్ తెలిపారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!