హుజురాబాద్ లో.. చతుర్ముఖ పోటీతో.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది.
హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్.. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థి, వీరితో పాటుగా షర్మిల పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీ, లెఫ్ట్ పార్టీలు, తెలుగుదేశం.. ఇలా చిన్నాచితకా మరెన్నో పార్టీలు ఉన్నాయి. వీరందరికీ.. తోడైతే తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ఈ క్రమంలో లాభనష్టాలెవరికి అన్న చర్చ.. రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రధాన పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందులో.. పోటీలో నిలబడే మిగతా పక్షాల కారణంగా ఓట్లు చీలి.. అది టీఆర్ఎస్, బీజేపీకి పడే ఓటింగ్ పై ప్రభావం చూపుతుందన్న బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా.. ఫిక్స్ డ్ ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి కాస్త ప్రయోజనం కలిగే అవకాశం కనిపిస్తోంది.
అంటే.. పోటీలో ప్రధానంగా ఉన్న పక్షాలకు.. కచ్చితమైన ఓటు బ్యాంకు అంటూ ఉంటుంది. ఆ ఓటు నిధిని ప్రత్యర్థులు చీల్చే విషయంపైనే కచ్చితంగా గెలుపోటములు ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ నాయకులు బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని.. కాబట్టి తమకు ఓటు బ్యాంకు చీలే అవకాశమే లేదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. తన ఇమేజ్, తనకు 20 ఏళ్లకు పైగా స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకు చెక్కు చెదరదని ధీమాగా ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఈ సారి చీలే ఓట్లు తమకే పడతాయని విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ఓట్లు ఎవరిని ప్రభావితం చేస్తాయి? అంతిమంగా హుజురాబాద్ గడ్డపై విజయనాదాన్ని వినిపించేదెవరన్నది.. ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!