కోలుకున్న ఏపీ గవర్నర్ బిబి హరి చందన్. పోస్ట్ కోవిడ్ సమస్యతో రెండోసారి ఆసుపత్రిలో జాయిన్ అయిన గవర్నర్. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రి నుంచి ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ కానున్న గవర్నర్.
ఈరోజు ఉదయం జలసౌధలో కేఆర్ఎంబి త్రి సభ్య కమిటీ సమావేశం. వర్చువల్ గా త్రిసభ్య కమిటీ భేటీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలపై చర్చ. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వాటాలపై చర్చ
నేడు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడు రోజులపాటు నిరవధిక సమ్మె
వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించనున్న తమిళనాడు సీఎం స్టాలిన్
వెల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ లో బిపిన్ రావత్ కుటుంబంతో పాటు మరణించిన వారికి నివాళులు అర్పించనున్న IAF చీఫ్ VR చౌధురి
పీఆర్సీ, ఫైనాన్స్ అంశాల పై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి జగన్. పీఆర్సీ, ఇతర డిమాండ్ల పై ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో జరుగనున్న కీలక సమీక్ష.