ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్రమాదం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని, ఫలితంగా ఆ రంగం ఇబ్బందుల్లో పడిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈరోజు నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read: కిమ్ మరో కీలక నిర్ణయం: గ్రామీణాభివృద్ధి, ఆహారంపై ప్రత్యేక దృష్టి…
Also Read
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే మూడో వేవ్ సంకేతాలు దేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. వారం రోజుల క్రితం 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు, ఇప్పుడు 4.59 శాతానికి చేరుకుంది. ఇది 5 శాతానికి చేరితే రెడ్ అలర్ట్ ప్రకటించక తప్పదు. టోటల్గా కర్ఫ్యూ విధించాల్సి రావొచ్చు. ఢిల్లీతో పాటు ముంబై నగరంలోనూ పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు కూడా ముంబై నగరంలోనే అధికసంఖ్యలో ఉన్నాయి. ముంబైలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులుండగా, ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇక దేశం మొత్తం మీద 1700 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణం కావడంతో అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
- Tags
- corona
- corona Cases
- Health
- india
- Omicron
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!