కోహ్లీ బర్త్డే స్పెషల్.. రికార్డుల కింగ్ అంటే ఇతడే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన, మెచ్చిన ఆటగాడు కోహ్లీ పుట్టినరోజు నేడు. నవంబర్ 5, 1988న జన్మించిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 13 ఏళ్లు దాటుతోంది.
Read Also: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బ్రావో !
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
సచిన్ సాధించిన పరుగులు, సెంచరీలను ప్రపంచంలో ఎవరైనా అధిగమిస్తారా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. కానీ కొన్నాళ్లకే క్రికెట్ పండితుల సందేహాలను పటాపంచలు చేసి మొనగాడినని నిరూపించుకున్నాడు కోహ్లీ. అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో ఇప్పటికే 23వేలకు పైగా పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు ఉన్న ఆటగాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు (3,225) చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో ఆటగాడు. కోహ్లీ ఇప్పటివరకు 57 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక విజయాలు (38) అందించాడు. కెప్టెన్గా అన్ని ఫార్మాట్లలో 41 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంకును పొందింది.
అంతేకాకుండా అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(19) అవార్డులను అందుకున్న రెండో ఆటగాడు. మూడు ఫార్మాట్లలో 70 సెంచరీలు పూర్తి చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (2010-2020), వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది 2017-18, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2012, 2017, 2018), ఐసీసీ స్పిరిట్ ప్లేయర్ 2019, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది 2018 అవార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఏకైక ఆటగాడు కూడా విరాటే. అటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు అందుకున్న ఆటగాడు కూడా అతడే. అయితే ఎన్ని రికార్డులు ఉన్నా విరాట్ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ రాకపోవడం నిరుత్సాహపరిచేదే. ఈ ఒక్క రికార్డును కూడా కోహ్లీ సాధించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఐపీఎల్లోనూ అతడి కెప్టెన్సీలో టైటిల్ రాకపోవడం గమనార్హం.

తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!