కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు : విజయశాంతి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేంద్రం కరోనా డోసులు ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు… రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుకుగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదు. రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచీ వాక్సినేషన్ ఆపేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు…. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు. కరోనా కట్టడిపై తెలంగాణ సర్కారు తీరిది. మరోవైపు మల్లాపూర్కు చెందిన ఒక గర్భిణిని చేర్చుకోవడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోంది. ఎందరో బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణం దృష్టి సారించాలి. ఇంకోపక్క తెలంగాణ రైతు మరోసారి కడగండ్ల పాలు కావడం బాధ కలిగిస్తోంది. వడ్ల కొనుగోళ్ళలో తెలంగాణ సర్కారు ఉదాసీనతతో ధాన్యం వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారు. తెలంగాణ సర్కారు ఎటు చూసినా వైఫల్యాలే తప్ప… పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ఒక ప్రణాళిక కనిపించడం లేదు.” అంటూ విజయశాంతి మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!