Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read Also: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయితే బీజేపీతో జతకడుతుందో ఆ పార్టీ తిరిగి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక.. తాను జీవితాంతం వైఎస్సార్ ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పారు. చంద్రబాబు తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే సంపద సృషించాడని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం తాను జైలుకు పోయిన మాట వాస్తవం అని చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..
చంద్రబాబు 5 కేసుల్లో A1 నిందితుడు అని విజయసాయి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకొని జైలుకు వెళ్లిన చంద్రబాబు తనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయలేక పోవచ్చు.. వినూత్నమైన ఆలోచనలతో పరిపాలించిన జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం అని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తానని.. కచ్చితంగా ఒక భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?