PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ మండుతుందని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు పాలించారు, కానీ 10 ఏళ్లు అధికారంలో లేకుంటే దేశాన్ని తగబెట్టేలా మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రుద్రాపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్య భాషా?? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ మైండ్సెట్తో కాంగ్రెస్కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు. అందుకే వారు ఆదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్లో కూలిన వంతెన.. కార్మికులకు గాయాలు
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదాన్లో ఇండియా కూటమి నేతలు అరెస్టైన కేజ్రీవాల్కి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయని ఆరోపించారు. ఈవీఎంలు, సోషల్ మీడియా, ప్రెస్లపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180 సీట్లకు మించి గెలవడదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, దేశం మొత్తం మండిపోతుందని, నా మాటలు గుర్తించండి అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ రోజు రుద్రపూర్ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రెండు క్యాంపుల మధ్య పోటీ ఉండబోతోందని, ఓ వైపు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత తీసుకొస్తున్నామని, మరోవైపు అవినీతిపరులు, దొరల ముఠా ఉందని అన్నారు. ఈ అవినీతిపరులు మోడీని తిట్టి, బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ అవినీతిని తొలగించాలని చెబితే, వారు అవినీతిపరులను రక్షించాలని చూస్తున్నారని ఇండియా కూటమిపై ఆరోపణలు చేశారు. తాను బెదిరింపులకు భయపడనని, అవినీతిపరులపై చర్యలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై పెద్దగా దాడి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!