టిప్పు సుల్తాన్ సింహాసనం వేలం.. మండిపడుతోన్న భారత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.. 18వ శతాబ్దంలో భారత్లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా బ్రిటన్పై మండిపడుతున్నారు నెటిజన్లు..
Read Also: నవంబర్ 17, బుధవారం దినఫలాలు…
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ఇక, టిప్పు సుల్తాన్ సింహాసనం విషయానికి వస్తే.. కిరీటం ఆభరణం అని కూడా పిలువబడే ఫినియల్ ఎనిమిది బంగారు పులి తలలలో ఒకటి, ఇది పాలకుడి సింహాసనాన్ని అలంకరించింది ఉంటుంది.. దీనిని “మైసూర్ టైగర్” అని కూడా పిలుస్తారు. అయితే, యునైటెడ్ కింగ్డమ్ దీని ఎగుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.. యూకే డిజిటల్, కల్చర్, మీడియా మరియు స్పోర్ట్ డిపార్ట్మెంట్, “£1.5 మిలియన్లకు వేలం పెట్టడంతో.. ఇది యూకే నుంచి నిష్క్రమించే అవకాశం లేకపోలేదు. కానీ, ఒక సంస్థ లేదా వ్యక్తి.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని కొనుగోలు చేయడానికి, దానిని ఎగుమతికి అనుమతించడంపై నిషేధం విధించింది. కాగా, బంగారంతో తయారు చేయబడిన ఈ సింహాసనంలో కెంపులు, పచ్చలు మరియు వజ్రాలు అమర్చారు.. 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల కళా నైపుణ్యాన్ని ఇది సూచిస్తోంది.. ఇక, టిప్పు సుల్తాన్ 1799లో ఓడిపోయి మరణించే వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అతిపెద్ద ముప్పుగా పరిగణించబడ్డాడు. అయితే, యూకేపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు నెటిజన్లు.. భారత్ నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను బహిరంగంగా వేలం వేయడమే కాదు.. ఇక భారత్కు చెందిన వ్యక్తులు దానిని కొనుగోలు చేసి తరలించకుండా కూడా ఎగుమతిపై నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!