గత పది రోజుల నుంచి ధాన్యం కోనుగోలు అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం… కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం తీరుకు నిరసనగా.. ఇవాళ ఇందిరా పార్క్ లో టీఆర్ఎస్ మహా ధర్నా చేస్తోంది.
అయితే…ఈ మహా ధర్నాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ… ఆయన స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు. మామూలు కార్యకర్త లాగే… జనం మధ్యలో కూర్చొని నిరసన తెలిపారు కేటీఆర్. కేసీఆర్ కూతురు కవిత, హరీష్ రావు స్టేజ్ ఎక్కినప్పటికీ… కేటీఆర్ మాత్రం… జనాల్లోనే ఉండి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసేలా కేటీఆర్ ఇవాళ వ్యవహరించారు. ప్రస్తుతం ఈ అరుదైన సంఘటన తెలంగాన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.