ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు..పదవులపై గులాబీ నేతల గంపెడాశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజులు,ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ.. నామినేటెడ్ పదవులపై చాలామంది టీఆర్ఎస్ నేతల ఆశలు తీరడంలేదు. ఈ ఏడాదిలోనైనా వారికల నెరవేరుతుందా? అధికారపార్టీ ఆలోచన ఏంటి? పదవులతో ఎంతమందిని సంతృప్తి పర్చగలదు? కొత్త ఏడాదిలో పదవులు వస్తాయనే ఆశల్లో నేతలు గంపెడాశలతో వున్నారు. 2018 డిసెంబర్లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నామినేటెడ్ పదవులపై అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
అప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి పదవీకాలం ముగియడంతో వాళ్లల్లో కొందరికి మరోఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. గడిచిన ఏడాది చివరిలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది అధికారపార్టీ. ఇందులో యువతకు ఛాన్స్ ఇవ్వడం.. సామాజిక, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పేర్లు ప్రకటించడంతో మిగతావారిలోనూ ఆశలు రేకెత్తాయి. కొత్త ఏడాదిలో ఆ ఛాన్స్ వస్తుందని చాలామంది లెక్కలేసుకుంటున్నారు కూడా.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
నామినేటెడ్ పదవుల్లో యువతకు ప్రాధాన్యం వుంటుందా?
ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతారు. ఈలోగా నామినేటెడ్ పదవులు చేపడితే జనాల్లో మళ్లీ బలం పుంజుకోవచ్చుననే అంచనాల్లో ఉన్నారు అధికారపార్టీ నాయకులు. ఇటీవల ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ భర్తీ చేసింది. వాటిపై చాలా మంది ఆశ పెట్టుకున్నా.. అనేక వడపోతల తర్వాత అనూహ్యంగా కొందరి పేర్లు జాబితాలోకి వచ్చాయి. మరికొందరి పేర్లు లిస్ట్లో నుంచి జారిపోయాయి. అలా చర్చల్లోకి వచ్చిన పేర్లతో కొందరిని నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పరిచారు. ముఖ్యంగా యువతకు పట్టంకట్టడం.. ఆ వర్గాల్లోనూ పదవులు ఆశించేవారి సంఖ్య పెరిగింది.
టీఆర్ఎస్లో తమకు పరిచయం ఉన్న నాయకులు.. అధిష్ఠానంతో దగ్గరగా ఉండేవారితో లాబీయింగ్ చేస్తున్నారట కొందరు యువ నేతలు. ఇప్పటికే వివిధ సందర్భాలలో అధినేత నుంచి హామీ పొంది.. పదవుల కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్యే చాంతాడంత ఉంది. ఆయా హామీల ప్రకారం.. వారి స్థాయిని భట్టి పదవులను ప్రకటిస్తారని 2018 నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పైగా పదవుల పందేరంలో పాతవాళ్లతోపాటు కొత్తవారు కూడా ఉండటంతో నేతల దృష్టి ప్రగతిభవన్పై పడింది. మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్నాయి. పైగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్గా ఎత్తుగడలు మొదలుపెట్టిన అధికారపార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అన్నది ఒక ప్రశ్న. ఇప్పటి వరకు ప్రకటించిన పదవులు చాలని అనుకుంటే.. ఆశల పల్లకీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటో.. ఎవరికి పదవీయోగం ఉంటుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!