రేవంత్ సంచలనం.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పొరు చేసిన గడ్డ ఇది అని గుర్తుచేశారు రేవంత్… అటువంటి వారిని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన ఆదివాసీ బిడ్డల పేర్లను స్మారక శిలాఫలకంపై లిఖిస్తామన్నారు. నాడు ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే భాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.
అయితే, పోరాటాల చరిత్ర ఉన్న ఆదిలాబాద్ టీఆర్ఎస్ మార్చేసిందని.. ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న, గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ ఈ జిల్లాకు పట్టిన చీడ అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.. ఇక, ఆదివాసీ, దళితుల కోసం సభ పెడితే పోలీసులు అడ్డుకోవడం తగునా.. అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు.. ఈ సభలో లక్షకు ఒక్క తల తక్కువగా ఉంటే నా తల వంచుతా.. ఇప్పుడు తల ఎత్తి.. కేసీఆర్ దల దించుతా అంటూ వ్యాఖ్యానించారు.. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ హెచ్చరించిన రేవంత్.. సీఎం కేసీఆర్ ను బొంద పెడుతా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేవారు.. 20 నెలల తర్వాత కేసీఆర్కు చర్లపల్లి జైలే గతి అని కామెంట్ చేసిన ఆయన.. అసలుకు మిత్తితో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. సన్నాసి బాల్క సుమన్… కాంగ్రెస్ ఏమి చేసిందని అడుగుతున్నాడు… నువ్వు రిజర్వేషన్ సీటులో ఎమ్మెల్యే, ఎంపీ కావడానికి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలి.. అప్పుడే దళిత బంధు లాంటి పథకాలు వస్తాయన్న ఆయన.. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు.. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద అప్పు మోపాడు.. కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు… కొడుకును టాటాను చేసాడు… బిడ్డను బిర్లాను చేసాడు అంటూ కామెంట్లు చేశారు.
Also Read
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ఇంకో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు రేవంత్రెడ్డి.. మీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణకు తల్లి అంటే సోనియమ్మ అన్నారు.. ఏడేళ్లలో ఏమివ్వలేదు. వాళ్ళు ఇంట్లో ఆస్తులోచ్చాయి.. రావుల రాజ్యంలో దళిత గిరిజనులకు ఏమి రావు అన్నారు.. ఈ సందర్భంగగా రేవంత్రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!