Separatist: వేర్పాటువాదులపై అణిచివేత.. పంజాబ్ పోలీసులకు సిక్కుల అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేర్పాటువాద బోధకుడు అమృతపాల్ సింగ్పై పంజాబ్ పోలీసుల చర్యలపై కొంత మంది సిక్కు పెద్దలు మండిపడుతున్నారు. అమృతపాల్ సింగ్పై పంజాబ్ పోలీసుల అణిచివేతపై భగవంత్ మాన్ ప్రభుత్వానికి, కేంద్రానికి వ్యతిరేకంగా అకల్ తఖ్త్ ఒక బలమైన ప్రకటనను విడుదల చేసింది. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసే వారిపై ఇలాంటి చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
వేర్పాటువాద బోధకుడికి వ్యతిరేకంగా అణిచివేత సమయంలో పట్టుబడిన సిక్కు యువకులను విడుదల చేయాలని అకల్ తఖ్త్ నేత జతేదార్ గియానీ హర్ప్రీత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. పంజాబ్లోని పరిస్థితులపై చర్చించేందుకు మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, మత, సామాజిక నేతలతో కూడిన సిక్కు సంస్థల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Also Read:Nallapareddy Prasanna kumar Reddy: వైసీపీకి గుడ్బై ప్రచారం.. స్పందించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
అమృతపాల్ సింగ్కు మద్దతిచ్చినందుకు అరెస్టయిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ఎందుకు ప్రయోగించారని ప్రశ్నిస్తూ, “హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారు లక్షల మంది ఉన్నారు. హిందూ రాష్ట్రం కోసం పిలుపునిచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. NSA కింద బుక్ చేయాలి” అని జతేదార్ వ్యాఖ్యానించారు. పోలీసు కస్టడీలో ఉన్న వారి విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సిక్కుల పరువు తీశారని ఆరోపిస్తున్న వార్తా ఛానెల్లను కూడా అతను టార్గెట్ చేశాడు.
మరోవైపు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తేలితే, ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని రాష్ట్ర పోలీసులను కోరినట్లు ముఖ్యమంత్రి మాన్ చెప్పారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కాగా, 353 మందిని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచగా 197 మందిని విడుదల చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!