జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు.. అందుకే ఇంతలా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు.
నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు!
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు టెస్ట్ చేయించుకోకపోగా.. చాలా నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్నారు.
టెస్ట్లు చేయించుకోకుండా గుట్టుగా ఉంటున్నారు!
కరోనా వచ్చినా, లక్షణాలు కనిపించినా, కనిపించకున్నా.. టెస్టులు చేయించుకోవడం లేదు సరికదా.. ఓ 5 రోజులు గుట్టు చప్పుడు కాకుండా లాగించేస్తే అది తగ్గిపోతుంది అని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. నలభై ఏళ్ల లోపు ఉన్నవాళ్లలో కరోనా వచ్చిన వాళ్ళు కొందరు ఇదే ధీమాతో జనంలో తిరిగేస్తున్నారు. వైరస్ సోకితే ప్రాణాలు పోతాయన్న భయం కంటే తమనెక్కడ అంటరాని వారిగా చూస్తారో అన్న ఆందోళన ఎక్కువగా ఉంది. తమ వల్ల కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. ఇతరులు ఇబ్బంది పడతారనే అవగాహన ఉన్నా సీరియస్గా తీసుకోవడం లేదు.
నాలుగు రోజుల్లో తగ్గిపోతుందనే ధీమాలో ఉన్నారా?
బస్స్టాపుల్లోనూ, మెట్రో స్టేషన్లు, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సుల్లో, ఫంక్షన్లలో కరోనా రోగులు జనంతో కలిసి పోతున్నారు. కొందరికి టెస్టులపై ఆసక్తి లేక, భయంతో ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకొందరు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది కదా అనే ధీమాతో జనంలో పడి తిరుగుతున్నారు. అన్లాక్ కొత్తలో భయం భయంగా రోడ్లమీదకు వచ్చిన జనాల్లో.. ఇప్పుడు వైరస్ పడగ విప్పి బుస కొడుతున్నా లెక్కలేనితనం కనిపిస్తోంది. ప్రాణాల మీదకు వచ్చాక చూద్దాం అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ఒక కరోనా పేషెంట్తో 120 మందికి వైరస్ వ్యాప్తి!
ఏడాదిన్నర క్రితం ఒక కరోనా పేషెంట్ వల్ల 12 మందికి వైరస్ సోకవచ్చనే అంచనా ఉండేది. ఇప్పుడది 120కి చేరింది. అంటే పదిరెట్లు. చాలా చోట్ల టెస్ట్లు చేయకపోవడం, పరీక్షలు చేసే సౌకర్యాలు లేవు. అసింప్టమేటిక్ వల్ల వైరస్ను గుర్తించక జనంలో తిరిగేస్తున్నారు కరోనా బాధితులు. కిందటేడు ఐడెంటిఫికేషన్ అయినా ఉండేది. ఇప్పుడు అదీ లేదు. సో వాళ్ల నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన వాళ్ళంతా మాస్క్ వేసుకోవడం ఒక్కటే మార్గం.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!