జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు.. అందుకే ఇంతలా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు.
నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు!
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు టెస్ట్ చేయించుకోకపోగా.. చాలా నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్నారు.
టెస్ట్లు చేయించుకోకుండా గుట్టుగా ఉంటున్నారు!
కరోనా వచ్చినా, లక్షణాలు కనిపించినా, కనిపించకున్నా.. టెస్టులు చేయించుకోవడం లేదు సరికదా.. ఓ 5 రోజులు గుట్టు చప్పుడు కాకుండా లాగించేస్తే అది తగ్గిపోతుంది అని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. నలభై ఏళ్ల లోపు ఉన్నవాళ్లలో కరోనా వచ్చిన వాళ్ళు కొందరు ఇదే ధీమాతో జనంలో తిరిగేస్తున్నారు. వైరస్ సోకితే ప్రాణాలు పోతాయన్న భయం కంటే తమనెక్కడ అంటరాని వారిగా చూస్తారో అన్న ఆందోళన ఎక్కువగా ఉంది. తమ వల్ల కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. ఇతరులు ఇబ్బంది పడతారనే అవగాహన ఉన్నా సీరియస్గా తీసుకోవడం లేదు.
నాలుగు రోజుల్లో తగ్గిపోతుందనే ధీమాలో ఉన్నారా?
బస్స్టాపుల్లోనూ, మెట్రో స్టేషన్లు, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సుల్లో, ఫంక్షన్లలో కరోనా రోగులు జనంతో కలిసి పోతున్నారు. కొందరికి టెస్టులపై ఆసక్తి లేక, భయంతో ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకొందరు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది కదా అనే ధీమాతో జనంలో పడి తిరుగుతున్నారు. అన్లాక్ కొత్తలో భయం భయంగా రోడ్లమీదకు వచ్చిన జనాల్లో.. ఇప్పుడు వైరస్ పడగ విప్పి బుస కొడుతున్నా లెక్కలేనితనం కనిపిస్తోంది. ప్రాణాల మీదకు వచ్చాక చూద్దాం అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ఒక కరోనా పేషెంట్తో 120 మందికి వైరస్ వ్యాప్తి!
ఏడాదిన్నర క్రితం ఒక కరోనా పేషెంట్ వల్ల 12 మందికి వైరస్ సోకవచ్చనే అంచనా ఉండేది. ఇప్పుడది 120కి చేరింది. అంటే పదిరెట్లు. చాలా చోట్ల టెస్ట్లు చేయకపోవడం, పరీక్షలు చేసే సౌకర్యాలు లేవు. అసింప్టమేటిక్ వల్ల వైరస్ను గుర్తించక జనంలో తిరిగేస్తున్నారు కరోనా బాధితులు. కిందటేడు ఐడెంటిఫికేషన్ అయినా ఉండేది. ఇప్పుడు అదీ లేదు. సో వాళ్ల నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన వాళ్ళంతా మాస్క్ వేసుకోవడం ఒక్కటే మార్గం.
తాజావార్తలు
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!