తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేళ కుటుంబంతో ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుదామని టపాసులు కొనుకొన్ని తన కుమారుడితో ఇంటికి వెళ్తుండగా ఉన్నంటుండి ఆ టపాసులు పేలడంతో ఆ తండ్రీకొడుకులు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పుదిచ్చేరికి చెందిన కలైనేషన్ (35) అనే వ్యక్తి విల్లుపురంలోని తన అత్తగారింట్లో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వచ్చాడు.
ఈ నేపథ్యంలో కలైనేషన్ తన కుమారుడు ప్రదేశ్ (7)తో కలిసి విల్లుపురంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణానికి వెళ్లి టపాసులు కొనుక్కొని స్కూటీపై తిరిగి ఇంటికి పయణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒక్కసారిగా ఆ టపాసులు పేలాయి. దీంతో కలైనేషన్, ప్రదేశ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడుతో సమీపంలో ఉన్న పలువరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.