MS Dhoni: చెపాక్ స్టేడియంలో ధోనీ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ తో బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సిజన్ లో తొలి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారథి MS ధోని రంగంలోకి దిగారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలోకి తిరిగి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ధోనీ మొరుపుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read:Pakistan: పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్..
ఐపీఎల్ 2023 మ్యాచ్ ప్రారంభం సందర్బంగా మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ తొలిరోజే గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది. దాంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రీడాభిమానులు MS ధోనిని చెపాక్లో తిరిగి చూస్తారు. నాలుగుసార్లు ఐపిఎల్ ఛాంపియన్లుగా నిలిచిన సీఎస్కే జట్టు శుక్రవారం సీజన్ ఓపెనింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో తలపడనున్నారు. మొదటి మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లని రెండుగా విభజించిన బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ.. ప్రాక్టీస్ మ్యాచ్ని ఆడించాడు. మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో హిట్టింగ్ చేసిన ధోనీ.. ఎక్కువగా మిడ్ వికెట్, స్ట్రయిట్ సిక్సర్లు కొడుతూ కనిపించాడు. ధోనీ సిక్సర్లు కొట్టిన ప్రతిసారీ స్టేడియాన్ని అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
Also Read:Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
గత సీజన్లో కొద్దికాలం పాటు ఆ స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా మినహా సూపర్ కింగ్స్కు పూర్తి స్థాయి కెప్టెన్ ధోనీ మాత్రమే. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీలో చేరిన ధోనీ పసుపు రంగు జెర్సీని ధరించి తన జోరు కొనసాగించాడు. గత సీజన్లో ప్లే-ఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత, కోపంతో రవీంద్ర జడేజా నుండి కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నాడు ధోనీ. ఐపీఎల్ లో మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటి వరకు 234 మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో 135.2 స్ట్రైక్రేట్తో 4978 పరుగులు చేశాడు ధోనీ. ఆయా మ్యాచ్ ల్లో 24 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటర్గా, కెప్టెన్గా చెన్నైకి విజయాల్ని అందించిన ధోనీ.. నాలుగు సార్లు టైటిల్ విజేతగా కూడా నిలిపాడు. అయితే, IPL 2023 సీజన్ ఆటగాడిగా ధోనికి చివరిది అని ప్రచారం జరుగుతోంది.
Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!