Pakistan: పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి సుమోటో నోటీసు తీసుకునే విచక్షణ అధికారాలను పరిమితం చేసే లక్ష్యంతో పాకిస్తాన్ న్యాయ మంత్రి అజం నజీర్ తరార్ మంగళవారం సుప్రీంకోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు. చౌదరి మహమూద్ బషీర్ విర్క్ అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమయ్యే తదుపరి ఆమోదం కోసం చట్టం, న్యాయంపై జాతీయ అసెంబ్లీ (NA) స్టాండింగ్ కమిటీకి సభ ప్రతిపాదిత బిల్లును పంపింది. కమిటీ దానిని తిరిగి దిగువ సభకు పంపుతుంది. జాతీయ అసెంబ్లీ బిల్లును ఆమోదించిన తర్వాత, అది ఆమోదం కోసం సెనేట్కు పంపబడుతుంది.
ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సయ్యద్ మన్సూర్ అలీ షా, జస్టిస్ జమాల్ ఖాన్ మండోఖైల్ పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అధికారాలపై ప్రశ్నలను లేవనెత్తిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరి నిర్ణయంపై ఆధారపడకూడదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ ఆమోదించిన నియమ-ఆధారిత వ్యవస్థ ద్వారా న్యాయస్థానాన్ని నియంత్రించాలని జస్టిస్ షా, జస్టిస్ మండోఖైల్ 27 పేజీల భిన్నాభిప్రాయ నోట్లో పంజాబ్, ఖైబర్లలో మార్చి 1న సుమోటో నోటీసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాశారు. నేషనల్ అసెంబ్లీ సెషన్లో హౌస్ ఫ్లోర్లో తన ప్రసంగంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంలో పార్లమెంటరీ చర్యను కోరారు. ఆయన ఈ భిన్నాభిప్రాయాన్ని ఆశాకిరణం అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో వచ్చే మార్పులు కచ్చితంగా దేశానికి ఆశాకిరణం లాంటివని వివరింటారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
Read Also: Karnataka Elections: నేడు కర్ణాటకలో మోగనున్న ఎన్నికల నగారా!
సుమోటో నోటీసుల పేరుతో తీసుకున్న చర్యల వల్ల సుప్రీం కోర్టు ప్రతిష్ట దెబ్బతింటోందని పాక్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తరార్ సభలో ప్రసంగించారు. గతంలో అనేక రివ్యూ కేసులు ఆలస్యం అయ్యాయని, విచారణలో పరిష్కరించబడలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తుల అసమ్మతి నోట్ మరింత ఆందోళనకు దారితీసిందని తరార్ అన్నారు. సుమోటో నోటీసుల కింద తీసుకున్న నిర్ణయాలపై ముందుగా అప్పీల్ చేయలేమని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి నుంచి సుమోటో నోటీసు తీసుకునే అధికారాలను ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీకి బదలాయించడం బిల్లులో ఉంది. ఇంకా, బిల్లులో నిర్ణయాన్ని సవాలు చేసే హక్కుకు సంబంధించిన క్లాజును 30 రోజుల్లోగా దాఖలు చేయవచ్చు. రెండు వారాల వ్యవధిలో విచారణలో పరిష్కరించబడుతుంది.ఈ బిల్లు ప్రకారం, సుప్రీంకోర్టు ముందున్న ప్రతి క్లాజు, అప్పీల్ లేదా మ్యాటర్ను పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన బెంచ్ విచారించి పరిష్కరించాలి. మెజారిటీ మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కూడా బిల్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!