తొలి ఫత్వా.. తాలిబన్ల వైఖరి తేలిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి చదువుకోవడమే కాణమంటున్నారు తాలిబన్లు. అందుకే ఆ విధానాన్ని నిషేధిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెరాత్ ప్రావిన్స్లోపని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేటు విద్యసంస్థల యజమానులతో దాదాపు మూడు గంటలపాటు చర్చించిన తాలిబన్లు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కో ఎడ్యుకేషన్ను నిలిపేయడతో పాటు, మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించాలని, పురుషులకు బోధించేందుకు అనుమతి లేదని తెలిపారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం హెరాత్ ప్రావిన్స్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, రెండు వేల మంది లెక్చరర్లు ఉన్నారు. 2001లో తాలిబన్ల పాలన తొలిసారి అంతమైన తర్వాత ఆప్ఘన్లో మహిళలకు స్వేచ్ఛ లభించింది. విద్యా, ఉద్యోగాల్లో పురుషులకు సరిసమానంగా హక్కులు దక్కాయి. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్ అమలులోకి వచ్చింది. ఆప్ఘన్ మళ్లీ తాలిబన్ల చేతికి రావడంతో ఇప్పుడా వ్యవస్థకు సమాధి కట్టాల్సి వస్తోంది. తాలిబన్లు జారీ చేసిన ఈ తొలి ఫత్వాతో భవిష్యత్తులో ఆప్ఘన్ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారో స్పష్టమవుతోంది. బయటకి మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తామంటున్న తాలిబన్లు.. లోపల మాత్రం తమ రాక్షసత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!