తొలి ఫత్వా.. తాలిబన్ల వైఖరి తేలిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి చదువుకోవడమే కాణమంటున్నారు తాలిబన్లు. అందుకే ఆ విధానాన్ని నిషేధిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెరాత్ ప్రావిన్స్లోపని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేటు విద్యసంస్థల యజమానులతో దాదాపు మూడు గంటలపాటు చర్చించిన తాలిబన్లు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కో ఎడ్యుకేషన్ను నిలిపేయడతో పాటు, మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించాలని, పురుషులకు బోధించేందుకు అనుమతి లేదని తెలిపారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం హెరాత్ ప్రావిన్స్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, రెండు వేల మంది లెక్చరర్లు ఉన్నారు. 2001లో తాలిబన్ల పాలన తొలిసారి అంతమైన తర్వాత ఆప్ఘన్లో మహిళలకు స్వేచ్ఛ లభించింది. విద్యా, ఉద్యోగాల్లో పురుషులకు సరిసమానంగా హక్కులు దక్కాయి. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్ అమలులోకి వచ్చింది. ఆప్ఘన్ మళ్లీ తాలిబన్ల చేతికి రావడంతో ఇప్పుడా వ్యవస్థకు సమాధి కట్టాల్సి వస్తోంది. తాలిబన్లు జారీ చేసిన ఈ తొలి ఫత్వాతో భవిష్యత్తులో ఆప్ఘన్ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారో స్పష్టమవుతోంది. బయటకి మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తామంటున్న తాలిబన్లు.. లోపల మాత్రం తమ రాక్షసత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..