తొలి ఫత్వా.. తాలిబన్ల వైఖరి తేలిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి చదువుకోవడమే కాణమంటున్నారు తాలిబన్లు. అందుకే ఆ విధానాన్ని నిషేధిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెరాత్ ప్రావిన్స్లోపని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేటు విద్యసంస్థల యజమానులతో దాదాపు మూడు గంటలపాటు చర్చించిన తాలిబన్లు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కో ఎడ్యుకేషన్ను నిలిపేయడతో పాటు, మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించాలని, పురుషులకు బోధించేందుకు అనుమతి లేదని తెలిపారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం హెరాత్ ప్రావిన్స్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, రెండు వేల మంది లెక్చరర్లు ఉన్నారు. 2001లో తాలిబన్ల పాలన తొలిసారి అంతమైన తర్వాత ఆప్ఘన్లో మహిళలకు స్వేచ్ఛ లభించింది. విద్యా, ఉద్యోగాల్లో పురుషులకు సరిసమానంగా హక్కులు దక్కాయి. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్ అమలులోకి వచ్చింది. ఆప్ఘన్ మళ్లీ తాలిబన్ల చేతికి రావడంతో ఇప్పుడా వ్యవస్థకు సమాధి కట్టాల్సి వస్తోంది. తాలిబన్లు జారీ చేసిన ఈ తొలి ఫత్వాతో భవిష్యత్తులో ఆప్ఘన్ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారో స్పష్టమవుతోంది. బయటకి మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తామంటున్న తాలిబన్లు.. లోపల మాత్రం తమ రాక్షసత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!