అఫ్ఘన్లో ఎగిరిన తాలిబన్ల జెండా.. అమెరికాకు కౌంటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికా ‘సెప్టెంబర్ 11’ రోజును కలలో కూడా మర్చిపోలేదు. ఈరోజునే అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించి అమెరికాకు సానుభూతి తెలిపాయి. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకు అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారిదంటూ ఆ దేశంపై దాడి చేసి వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈక్రమంలోనే నాటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా నామరూపల్లేకుండా చేసింది. అయితే 20ఏళ్లు తిరిగే సరికి అప్ఘనిస్తాన్లో మళ్లీ అవే ఛాయలు కన్పిస్తున్నాయి. అఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో ఆదేశం తిరిగి తాలిబన్ల పాలనలోకి వెళ్లడం శోచనీయంగా మారింది.
అఫ్ఘన్ పై దురాక్రమణ చేసిన తాలిబన్లు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. సెప్టెంబర్ 11న తాలిబన్ల కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఈమేరకు అప్ఘన్ తాత్కాలిక ప్రధానిగా ముల్లా మహమ్మద్ నియామమం అయ్యారు. ఈయనతోపాటు మరికొంతమంది కేబినెట్ మంత్రుల లిస్టును తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు ఇప్పటికే ప్రకటించారు. ఈక్రమంలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాలిబన్లు సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఈరోజునే ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడి అధికారిక భవనం మీద తాలిబన్లు తమ జెండాను ఎగురవేశారు. భవనం ప్రధాన ముఖ ద్వారం వద్ద భారీ జెండాను కట్టడంతో బ్యానర్లను ప్రదర్శించారు. ఈమేరకు తాలిబన్ల సాంస్కృతిక కమిషన్ అధినేత అహ్మదుల్లా ముత్తాకీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్ష భవనంపై తెల్లటి బ్యానర్పై నల్లరంగు అక్షరాలను ముద్రించిన పతాకాన్ని తాము ఎగురవేసినట్లు ఆయన తెలిపారు. తమ పరిపాలన అఫ్ఘన్లో ప్రారంభమైందని చెప్పడానికి ఈ పతాకం నిదర్శమని ముక్తాకీ స్పష్టం చేశారు.
న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న రోజే తాలిబన్ల పతకాన్ని ఎగరవేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని ముక్తాకీ తేల్చిచెప్పారు. ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్లు అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించిన విధివిధానాలు ఎలా ఉండాలనే విషయంపై తాలిబన్ల అగ్ర నాయకత్వం వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో సంప్రదింపులను జరుపుతుందని స్పష్టం చేశారు.
గతంలో తాలిబన్లు పాలించినట్లుగా మత ఛాందసవాదాన్ని.. ఇస్లామిక్ భావజాలానికి ఈసారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే తమ పరిపాలన సాగుతుందన్నారు. అదే సమయంలో వివాదాస్పదమైన షరియా చట్టాన్ని ఖచ్చితంగా అనుసరిస్తామని ముక్తాకీ స్పష్టం చేశారు. దీంతో అఘన్లో కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఏదిఏమైనా తాలిబన్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చినరోజే తమ పతకాన్ని అఫ్గన్లో ఎగువేసి ఆదేశానికి కౌంటర్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు కన్పిస్తోంది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..