తెలంగాణ బీజేపీలో గుడ్బైల కాలం నడుస్తోందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్. ఆ పార్టీ ఏంటో.. లెట్స్ వాచ్!
బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు!
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో జరిగిన పరిణామాలు రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం అలా రాజుకుంటూ రాజుకుంటూ ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇ. పెద్దిరెడ్డిలు బీజేపీని వీడి వెళ్లేలా చేసింది.
ఈటల చేరిక సమయంలోనే ఓపెన్గా విమర్శలు
ఈటల బీజేపీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుందని కమలనాథులు లెక్కలేశారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వారిని కలవర పెడుతున్నాయట. ఈటల బీజేపీలో చేరుతున్నప్పుడే ఒకరిద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్గానే నిరసన తెలిపారు కూడా. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలా నిలదీసిన వారిలో ముందువరసలో మాజీ మంత్రులు ఇ. పెద్దిరెడ్డి, మోత్కుపల్లి ఉన్నారు. వీరిద్దరూ టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చినవారే.
అవమానంగా భావించిన పెద్దిరెడ్డి!
ఈటలను బీజేపీలో చేర్చుకునే విషయంలో తమ అభిప్రాయాన్ని తీసుకోలేదని ఇద్దరు మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా హుజురాబాద్కే చెందిన తనకు తెలియకుండా ఈ చేరికలు ఏంటని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి. ఇది తనను అవమానించడం కాదా అని తనను కలిసిన బీజేపీ పెద్దలను పెద్దిరెడ్డి నిలదీశారట. ఇదే అంశంపై ఎవరెళ్లి బుజ్జగించినా ఆయన చల్లబడలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈటల వచ్చాక తన అవసరం లేదని బీజేపీ భావించినట్టు ఉంది.. అందుకే రాజీనామా చేసినట్టుగా సన్నిహితులకు చెప్పారట.
అదను చూసి బీజేపీ నేతలకు టీఆర్ఎస్ గాలం!
బీజేపీని వీడిన మోత్కుపల్లి నర్సింహులు కూడా వెళ్తూ వెళ్తూ ఈటలపైనే గురిపెట్టారు. బీజేపీ వైఖరిని ఎండగట్టారు. వాస్తవానికి బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాలను ముందు నుంచీ గమనిస్తూ వస్తున్న టీఆర్ఎస్.. అదను చూసి ఇద్దరు మాజీ మంత్రులను క్యాచ్ చేసింది. స్వయంగా సీఎం రంగంలోకి దిగి వారితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆ విధంగా మాజీ మంత్రులు టీఆర్ఎస్కు దగ్గరైనట్టు టాక్.
ఈటల చేరిక టైమ్లో హడావిడి వల్ల ముఖ్య నేతల మధ్య మనస్పర్థలు
రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి ఇద్దరు మాజీ మంత్రుల రాజీనామా మింగుడు పడటం లేదు. ఒక మాజీ మంత్రిని తీసుకుంటే.. ఇద్దరు మాజీలు దూరమయ్యారనే చర్చ జరుగుతోంది. పైగా ఈటల జాయినింగ్ టైమ్లో కొందరు బీజేపీ నాయకులు చేసిన హడావిడి వల్ల కూడా ముఖ్య నేతల మధ్య మనస్పర్థలు వచ్చాయని చెవులు కొరుక్కుంటున్నారు. వారు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. ఈ గొడవలు ఎలా ఉన్నా.. ఈటల పేరు చెప్పి బీజేపీ నుంచి ఇంకెవరెవరు గోడ దూకుతారనే చర్చ కాషాయ శిబిరంలో జోరుగానే సాగుతోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?