Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Prakasam District Tdp Mlas

సీమ ప్రాజెక్టులపై లేఖరాసిన టీడీపీ ఎమ్మెల్యేలు యూటర్న్‌…!

Published Date :July 13, 2021 , 3:23 pm
By Manohar
సీమ ప్రాజెక్టులపై లేఖరాసిన టీడీపీ ఎమ్మెల్యేలు యూటర్న్‌…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని లేఖలు రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారు? 24 గంటల్లో వారికి ఏమైంది? తడబడ్డారా.. తొందపాటుతో ఇరుకున పడ్డారా? ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందా?

సీమ ప్రాజెక్టులపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి యుద్ధం జరుగుతోంది. నీరే నిప్పుగా మారిన పరిస్థితి. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది టీడీపీ. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాయలసీమలో చేపడుతున్న ప్రాజెక్టులు, కొత్త లిఫ్ట్‌ల వల్ల తమ పరిస్థితి ఏంటని లేఖలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు. ఏపీ సర్కార్‌ చేపట్టిన రెండు ప్రాజెక్టులపై వారు అభ్యంతరాలు తెలియజేశారు.

24 గంటల తిరగకుండానే గొంతు సవరించిన టీడీపీ ఎమ్మెల్యేలు!
ఎమ్మెల్యేల లేఖకు టీడీపీ ఆమోదం ఉందా?
టీడీపీ ఎందుకు పెంట పెట్టుకుంది?

టీడీపీ ఎమ్మెల్యేల లేఖతో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వారు లేవనెత్తి విషయాలు ఎలా ఉన్నా.. 24 గంటలు తిరక్కుండానే గొంతు సవరించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీమ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదంటూనే.. ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటన్నదే తమ ప్రశ్నగా చెప్పుకొచ్చారు. ముందుగా ప్రకాశం జిల్లా సంగతి తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ వైఖరే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. అసలు ఎమ్మెల్యేలు రాసిన లేఖకు టీడీపీ ఆమోదం ఉందా.. లేదా? లేఖ వచ్చిన 24 గంటల్లో ఏం జరిగింది? రాయలసీమ విషయంలో తెలుగుదేశం ఎందుకు పెంట పెట్టుకుంది? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారా?
సీమ ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేనప్పుడు లేఖ ఎందుకు?

అసలే ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ ప్రాజెక్టులపై ఘర్షణ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల లేఖ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాంతాల మధ్య ఘర్షణ వచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ రాజకీయంగా ఇంకేదైనా లెక్కలు వేసిందా? లేక ఎమ్మెల్యేలే అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న అనుమానాలు ఉన్నాయి. 24 గంటల ముందు విడుదల చేసిన లేఖలో రాయలసీమ ప్రాజెక్టులపై అంతెత్తున లేచిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అభ్యంతరాలు లేనప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? లేఖ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారు? ఒకవేళ ప్రకాశం జిల్లా గురించే వారి ఆవేదన అయితే.. దానిపైనే మాట్లాడాలి. టీడీపీ ఎమ్మెల్యేల తీరు అలా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

లేఖను ఎమ్మెల్యేలు సొంతంగానే రాశారా?

రాయలసీమ ప్రాజెక్టులు.. ప్రాంతాల వారీగా ఎవరికెన్ని నీళ్లు అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ లేఖ రాసి రచ్చ లేపారు. వైసీపీ, బీజేపీలకు టార్గెట్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఆయుధాలు ఇచ్చారని అనుకుంటున్నారు. లేఖ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. తమ బాధ చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు భావించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే లేఖను ఎమ్మెల్యేలు తమంతట తామే రాశారా? దాని వెనక ఇంకేదైనా ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా తాజా లేఖాస్త్రం.. మారిన టీడీపీ ఎమ్మెల్యేల స్వరం.. సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టే అవకాశాలు లేకపోలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Prakasam District
  • prakasam tdp mla's
  • tdp mla's
  • ycp

తాజావార్తలు

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..

  • Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

ట్రెండింగ్‌

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions