Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Prakasam District Tdp Mlas

సీమ ప్రాజెక్టులపై లేఖరాసిన టీడీపీ ఎమ్మెల్యేలు యూటర్న్‌…!

Published Date :July 13, 2021 , 3:23 pm
By Manohar
సీమ ప్రాజెక్టులపై లేఖరాసిన టీడీపీ ఎమ్మెల్యేలు యూటర్న్‌…!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని లేఖలు రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారు? 24 గంటల్లో వారికి ఏమైంది? తడబడ్డారా.. తొందపాటుతో ఇరుకున పడ్డారా? ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందా?

సీమ ప్రాజెక్టులపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Add as a preferred
source on google

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి యుద్ధం జరుగుతోంది. నీరే నిప్పుగా మారిన పరిస్థితి. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది టీడీపీ. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాయలసీమలో చేపడుతున్న ప్రాజెక్టులు, కొత్త లిఫ్ట్‌ల వల్ల తమ పరిస్థితి ఏంటని లేఖలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు. ఏపీ సర్కార్‌ చేపట్టిన రెండు ప్రాజెక్టులపై వారు అభ్యంతరాలు తెలియజేశారు.

24 గంటల తిరగకుండానే గొంతు సవరించిన టీడీపీ ఎమ్మెల్యేలు!
ఎమ్మెల్యేల లేఖకు టీడీపీ ఆమోదం ఉందా?
టీడీపీ ఎందుకు పెంట పెట్టుకుంది?

టీడీపీ ఎమ్మెల్యేల లేఖతో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వారు లేవనెత్తి విషయాలు ఎలా ఉన్నా.. 24 గంటలు తిరక్కుండానే గొంతు సవరించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీమ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదంటూనే.. ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటన్నదే తమ ప్రశ్నగా చెప్పుకొచ్చారు. ముందుగా ప్రకాశం జిల్లా సంగతి తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ వైఖరే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. అసలు ఎమ్మెల్యేలు రాసిన లేఖకు టీడీపీ ఆమోదం ఉందా.. లేదా? లేఖ వచ్చిన 24 గంటల్లో ఏం జరిగింది? రాయలసీమ విషయంలో తెలుగుదేశం ఎందుకు పెంట పెట్టుకుంది? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారా?
సీమ ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేనప్పుడు లేఖ ఎందుకు?

అసలే ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ ప్రాజెక్టులపై ఘర్షణ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల లేఖ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాంతాల మధ్య ఘర్షణ వచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ రాజకీయంగా ఇంకేదైనా లెక్కలు వేసిందా? లేక ఎమ్మెల్యేలే అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న అనుమానాలు ఉన్నాయి. 24 గంటల ముందు విడుదల చేసిన లేఖలో రాయలసీమ ప్రాజెక్టులపై అంతెత్తున లేచిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అభ్యంతరాలు లేనప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? లేఖ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారు? ఒకవేళ ప్రకాశం జిల్లా గురించే వారి ఆవేదన అయితే.. దానిపైనే మాట్లాడాలి. టీడీపీ ఎమ్మెల్యేల తీరు అలా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

లేఖను ఎమ్మెల్యేలు సొంతంగానే రాశారా?

రాయలసీమ ప్రాజెక్టులు.. ప్రాంతాల వారీగా ఎవరికెన్ని నీళ్లు అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ లేఖ రాసి రచ్చ లేపారు. వైసీపీ, బీజేపీలకు టార్గెట్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఆయుధాలు ఇచ్చారని అనుకుంటున్నారు. లేఖ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. తమ బాధ చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు భావించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే లేఖను ఎమ్మెల్యేలు తమంతట తామే రాశారా? దాని వెనక ఇంకేదైనా ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా తాజా లేఖాస్త్రం.. మారిన టీడీపీ ఎమ్మెల్యేల స్వరం.. సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టే అవకాశాలు లేకపోలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Prakasam District
  • prakasam tdp mla's
  • tdp mla's
  • ycp

తాజావార్తలు

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్

  • Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?

  • Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!

  • Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ

  • Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions