ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి పాల్గొన్నారు.
Read Also: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్
Also Read
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధాని అన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని తాము అమరావతిలో నిర్మిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని… అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!