దేశంలో భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ యూజర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు 40 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారి సంఖ్య కూడా 47 శాతానికి చేరింది. ముఖ్యంగా 15-25 ఏళ్ల మధ్య వయసు వారు నెట్ ఎక్కువగా వాడుతున్నారని సర్వే తెలిపింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 2019లో 19 శాతం మాత్రమే ఉండగా… 2021 నాటికి 47 శాతానికి పెరిగింది. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారిలో ఢిల్లీలో 72 శాతం మంది ఉండగా… మహారాష్ట్రలో 55 శాతం మంది, తమిళనాడులో 53 శాతం మంది, అసోంలో 37 శాతం మంది ఉన్నారు.
దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకందారులు, ఇంటర్నెట్ వాడుతున్న వారిపై లెర్నింగ్ ఇనిషియేట్స్ ఇన్ రీఫామ్స్ ఫర్ నెట్వర్క్ ఏకనామిస్ ఏసియా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఇందులో భాగంగా 7వేల మంది నుంచి వివరాలు సేకరించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఒక్క 2020-21 ఏడాదిలో 13.2 కోట్ల మంది ఆన్లైన్లోకి వచ్చినట్లు స్పష్టమైంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో 57 శాతం మంది పురుషులు ఉండగా.. 36 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం 55 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతానికి పరిమితమైంది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
Read Also: రిక్షా కార్మికుడికి జాక్పాట్… రూ.కోటి దానం చేసిన వృద్ధురాలు
అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య తగ్గుతోంది. ఉన్నత విద్య చదివిన వారిలో 89 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఉద్యోగం ఉన్న వారిలో 54 శాతం మంది, నిరుద్యోగుల్లో 44 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. లాక్డౌన్లో ఒకటో తరగతి వారు 11 శాతం, రెండో తరగతి వారు 14 శాతం, మూడో తరగతి వారు 18 శాతం, నాలుగో తరగతి వారు 17 శాతం, ఐదో తరగతి వారు 15 శాతం, ఆరో తరగతి వారు 23 శాతం, 7, 8 తరగతుల వారు 20 శాతం, 9వ తరగతి వారు 21 శాతం, పదో తరగతి వారు 26 శాతం, 11వ తరగతి వారు 33 శాతం, 12వ తరగతి వారు 29 శాతం మందికి ఆన్లైన్ విద్యను అభ్యసించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!