TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు.. కోచింగ్ సెంటర్లపై నిఘా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులని విచారిస్తున్న అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. వారిలో ఇప్పటికే 10 మందికి పైగా గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ గుర్తించింది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవాళ్లు కూడానోటీసులు అందుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: IND vs AUS 3rd ODI : సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. కుల్దీప్ యాదవ్పై సీరియస్
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితులను సిట్ప్రశ్నిస్తోంది. అరెస్టు చేసిన 9 మంది నిందితులకు ఆరు రోజుల కస్టడీలో భాగంగా సిట్ ఐదో రోజు విచారణను కొనసాగింది. లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశ్న పత్రాల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త మాట్లాడినట్టు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నిందితులు ఎవరేవరికి కాల్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలించింది.
Also Read: Rain Alert: మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!