యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో అక్టోబర్ 24న భారత్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ మ్యాచ్ కు తాను మాయం అయిపోతున్నట్లు భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో సానియా ను అభిమానులు ట్రోల్ చేస్తూ ఉంటారు. దాని నుండి తప్పించుకోవడానికి సానియా ఓ నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న రోజు సోషల్ మీడియా నుండి తాను మాయం అవుతున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ చేసింది. అయితే ఈ భారత క్రీడాకారిణి 2010 లో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు అయిన షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.