Sajjala: ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ.. చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ డోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటర్లను తొలగించి, దొంగ ఓట్లను నమోదు చేయించిన చరిత్ర చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబు, ఆయన కరపత్రాలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలకుడు ఎలా ఉండకూడదు అనడానికి చంద్రబాబు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. పాలకుడు ఎలా ఉండాలి అనడానికి వై ఎస్ జగన్ ఉదాహరణ గా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల తాము ఎప్పుడు సానుకూలంగా ఉన్నామన్నారు.
Also Read:Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
ప్రభుత్వ ఉద్యోగుల వలనే ప్రభుత్వం ఇంత విజయవంతంగా నడుస్తోందన్నారు సజ్జల. ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసంతో పని చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 శాతం జీతాలు ఇవ్వలేదన్నారు. తాము ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా జమ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచిందన్న సజ్జల..చంద్రబాబు దిగే ముందు వరకు 5 డిఏలు బకాయి పెట్టాడరని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం తాము చర్చిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.
Also Read:Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
Also Read
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసి పంపించారు. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖలో చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!