Sajjala: ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ.. చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ డోస్
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటర్లను తొలగించి, దొంగ ఓట్లను నమోదు చేయించిన చరిత్ర చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబు, ఆయన కరపత్రాలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలకుడు ఎలా ఉండకూడదు అనడానికి చంద్రబాబు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. పాలకుడు ఎలా ఉండాలి అనడానికి వై ఎస్ జగన్ ఉదాహరణ గా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల తాము ఎప్పుడు సానుకూలంగా ఉన్నామన్నారు.
Also Read:Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
ప్రభుత్వ ఉద్యోగుల వలనే ప్రభుత్వం ఇంత విజయవంతంగా నడుస్తోందన్నారు సజ్జల. ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసంతో పని చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 శాతం జీతాలు ఇవ్వలేదన్నారు. తాము ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా జమ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచిందన్న సజ్జల..చంద్రబాబు దిగే ముందు వరకు 5 డిఏలు బకాయి పెట్టాడరని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై నిరంతరం తాము చర్చిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.
Also Read:Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
Also Read
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసి పంపించారు. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖలో చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!