Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైఎస్సార్సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్ అని తెలిపారు. 12 ఏళ్లుగా వైఎస్ జగన్ ఆదర్శ వంతంగా పార్టీని నడుపుతున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు.
Also Read:YSRCP: వైఎస్ఆర్సీపీకి 13 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Also Read
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాల చేస్తున్నారని చెప్పారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలో నే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎవరూ చెయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ తో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని చెప్పారు. మహిళలకు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదన్నారు. సీఎం జగన్ అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారని తెలిపారు. ఎంత మంది కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీని ఏమి చెయలేరని సజ్జల స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!