Sachin Pilot Vs Ashok Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్ లో పోరు.. నిరాహారదీక్షకు దిగిన సచిన్ పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ లో పార్టీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం స అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన కార్యకర్తలతో కలిసి జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రోజంతా నిరాహార దీక్ష చేస్తున్నారు. సచిన్ పైలట్ నిరాహార దీక్ష ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్లో రాజకీయ రగడ పెరిగింది. అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
Also Read:Son Killed Father: ఆస్తి వివాదంలో వృద్ధుడి హత్య.. కొడుకు, మనవడి కోసం వెతుకులాట
వసుంధర రాజే సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్కామ్లపై చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని లేవనెత్తుతూ పైలట్ నిరాహారదీక్షను ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస దీక్ష కొనసాగనుంది. పైలట్ నిరాహార దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన మద్దతుదారులు జైపూర్ చేరుకుంటున్నారు. పైలట్ అనుకూల నాయకులు మరియు ఎమ్మెల్యేలు జైపూర్ చేరుకోవాలని ఎంపిక చేసిన మద్దతుదారులకు సందేశం ఇచ్చారు. జైపూర్లోని అమరవీరుల స్మారకం వద్ద మంగళవారం ప్రారంభమైన సచిన్ పైలట్ నిరాహార దీక్షకు సన్నాహాలు సోమవారం అర్థరాత్రి వరకు కొనసాగాయి.
గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయడం ఇదే తొలిసారి. మరోవైపు, పైలట్ చర్య పార్టీ వ్యతిరేక చర్య అని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధావా అభివర్ణించారు. పైలట్ దీక్ష నేపథ్యంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ రంధవా మంగళవారం మధ్యాహ్నం జైపూర్కు చేరుకుంటున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసారతో రాంధావా భేటీ కానున్నారు. అయితే, రాంధావా ప్రకటన పార్టీ యొక్క కఠినమైన వైఖరిని సూచిస్తుంది.
Also Read:Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం బంగారం ధర ఎంతంటే?
Also Read
సోమవారం అర్థరాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు- ‘సచిన్ పైలట్ పగటిపూట నిరాహార దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధం మరియు పార్టీ వ్యతిరేక చర్య. సొంత ప్రభుత్వంతో తనకు ఏదైనా సమస్య ఉంటే మీడియా, ప్రజల్లో కాకుండా పార్టీ వేదికపైనే చర్చించుకోవచ్చు. నేను గత 5 నెలల నుండి AICCకి ఇన్ఛార్జ్గా ఉన్నాను, కానీ పైలట్ జీ నాతో ఈ విషయం గురించి ఎప్పుడూ చర్చించలేదు. నేను వారితో టచ్లో ఉన్నాను, ఇంకా శాంతియుతంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన మూలస్తంభం” అని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా అని వ్యాఖ్యానించారు.
Statement issued by Shri Sukhjinder Singh Randhawa, AICC In charge of Rajasthan. pic.twitter.com/PMn8aDdu0O
— INC Sandesh (@INCSandesh) April 10, 2023
కాగా, సచిన్ పైలట్ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహారదీక్షను ప్రకటించడం ద్వారా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో ఉంటూనే పైలట్ గెహ్లాట్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!