Regional Parties: దేశంలోని 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regional Parties: దేశవ్యాప్తంగా ఉన్న 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జనతాదళ్(యునైటెడ్) పార్టీ నిలిచింది. కరోనా వైరస్ విజృంభించిన కాలంలో కూడా అత్యధిక సంఖ్యలో విరాళాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా, బీహార్లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 60.15 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన రిపోర్టులో వెల్లడించింది.
జేడీయూ తర్వాతి స్థానంలో తమిళనాడులోని రూలింగ్ పార్టీ డీఎంకే, ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిలిచాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీకి రూ.33.99 కోట్లు, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్కి రూ.11.32 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కి నికరంగా రూ.4.16 కోట్ల డొనేషన్లు వచ్చాయి. తెలంగాణలోని రూలింగ్ పార్టీ టీఆర్ఎస్కి రూ.4.15 కోట్లు అందినట్లు ఏడీఆర్ పేర్కొంది. మొత్తం విరాళాల్లో సింహభాగాన్ని ఈ ఐదు రీజనల్ పార్టీలే సొంతం చేసుకోవటం విశేషం.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..
పైగా ఈ ఐదు పార్టీల్లో ఒక్కటి (ఐయూఎంఎల్) మినహా మిగతా నాలుగూ అధికారంలోనే ఉండటం గమనార్హం. 95.45 కోట్ల రూపాయలు 207 డొనేషన్ల రూపంలో కార్పొరేట్/బిజినెస్ సెక్టార్ నుంచి అందాయి. మరో రూ.25.57 కోట్లను 2,569 మంది వ్యక్తిగత విరాళాల రూపంలో ఇచ్చారు. జేడీయూకి వచ్చిన 60.15 కోట్ల రూపాయల్లో రూ.59.24 కోట్లు 58 డొనేషన్ల రూపంలో, మిగతా రూ.90 లక్షలు 272 మంది నుంచి వ్యక్తిగత విరాళాలుగా అందాయి. ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పోల్చితే అధికార పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఎందుకంటే రూలింగ్ పార్టీలతో, వాటి ప్రభావం కొద్దోగొప్పో ఉండే ప్రభుత్వ అధికారులతో ఆయా వ్యక్తులకు లేదా కార్పొరేట్/బిజినెస్ సెక్టార్కి చాలా పనులు ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్టులు, వివిధ ప్రాజెక్టులు, కొత్త వ్యాపారాలకు అనుమతులు.. ఇలా పలు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది అధికార పార్టీలకు కలిసొస్తుంది. దీన్నే గిట్టనివాళ్లు క్విడ్-ప్రొ-కొ (నీకిది-నాకది) అని విమర్శిస్తూ ఉంటారు. ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి అత్యధికంగా డొనేషన్లు రావటం తెలిసిందే.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?