Ganga Ramayan Tour: గంగా రామాయణం టూర్ ప్యాకేజీ.. యాత్ర విశేషాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.’గంగా రామాయణ’ యాత్ర టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుండి నడుస్తోంది. ఇది పర్యాటకులను విమానంలో తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, సారనాథ్లోని దేవాలయాలను చూపిస్తారు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ మే 4న అందుబాటులోకి వస్తుంది.
Also Read:Flight to Alaska: ఛీఛీ.. విమానంలో పాడు పని!
IRCTC గంగా రామాయణ యాత్ర మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. వారణాసి చేరుకున్న అనంతరం హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్ సందర్శించండి. వారణాసిలో రాత్రి బస చేస్తారు. రెండవ రోజు ఉదయం సారనాథ్ బయలుదేరవలసి ఉంటుంది. మధ్యాహ్నం వారణాసికి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. ఘాట్లను సందర్శించవచ్చు లేదా షాపింగ్ చేయవచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు.
Also Read:Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
మూడవ రోజు వారణాసిలో చెక్ అవుట్ చేసి, ప్రయాగ్రాజ్కి బయలుదేరుతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం చూడవచ్చు. సాయంత్రం అయోధ్యకు వెళ్తారు. రాత్రికి అయోధ్యలో బస చేస్తారు. నాల్గవ రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లక్నోకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. ఇక, ఐదవ రోజు నైమిశారణ్యం పూర్తి రోజు దర్శనం ఉంటుంది. సాయంత్రం లక్నోకు తిరిగి వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరవ రోజు బారా ఇమాంబర, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు విమానం లక్నో చేరుకుని రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. IRCTC గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధరను పరిశీలిస్తే.. మీరు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.28,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో విమాన టిక్కెట్లు, హోటల్, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ బస్సులో సందర్శనా, ప్రయాణ బీమా వంటివి ఉంటాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!