Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rains Are Likely To Occur In Telangana For Two Days

Rain Alert: తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Published Date :March 28, 2023 , 7:07 am
By NTV WebDesk
Rain Alert: తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

Also Read:Bansuri Swaraj: రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. బీజేపీలో కీలక పదవిలో నియామకం

Also Read

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
  • Modi-Trump: బెంగాల్‌లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
  • Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
  • TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మంగళవారం ఒకటి రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది.

Also Read:Bilkis Bano Case: బిల్కిస్‌ బానో పిటిషన్‌పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్‌ సర్కారుకు నోటీసులు

ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 04 నుంచి 08 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం హకీంపేటలో 5.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లో 2.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. నిజామాబాద్ గరిష్టం 36.7, గరిష్టం 24.3, నల్గొండ గరిష్టం 34.5, కనిష్టంగా 20.0, మెదక్ 35.8, కనిష్టంగా 21.0, మహబూబ్ నగర్, గరిష్టంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి.

Also Read:Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)
మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటమునిగాయి. వడగళ్లు, ఈదురు గాలులతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మామిడి, మిర్చి, మొక్కజోన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.28లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొక్కజొన్న, మిర్చి వేసిన చాలా మంది అన్నదాతలు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే ఆకాల వర్షాలతో పంట నష్టం జరిగిన జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. బాధిత రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ సాయాన్ని కూడా ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Meteorological Center
  • Meteorological Department
  • telangana
  • yellow alert

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions