Bilkis Bano Case: బిల్కిస్ బానో పిటిషన్పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్ సర్కారుకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case: 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్ 18లోగా సిద్ధం చేసుకోవాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్ బానో పిటిషన్పై భావోద్వేగాలకు లోబడి తీర్పు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో సవివరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దోషులకు రెమిషన్ను చట్టప్రకారమే మంజూరా చేశారా? అని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.
అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు పాశవికంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ సర్కారు దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. అయితే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది.
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Read Also: Landslide: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
దోషులు జైలు నుంచి విడుదలైన అనంతరం వారిని పూలమాలలతో సత్కరించడం, మిఠాయిలు పంచడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే దోషులకు రెమిషన్ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!