Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో వివాహ పథకంపై తీవ్ర దుమారం రేగుతోంది. లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడంతో వారి గర్భ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ విరుచుకుపడ్డాయి. దిండోరి జిల్లాలోని గడసరాయ్ పట్టణంలో జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద 219 జంటలకు వివాహం చేసింది. అయితే ఈ సామూహిక కళ్యాణోత్సవంలో పెళ్లికి వచ్చిన కొందరు మహిళల పేర్లు జాబితాలో కనిపించలేదు. వారి ప్రెగ్నెన్సీ టెస్ట్లు పాజిటివ్గా తేలడంతో వారి పేర్లను ప్రస్తావించలేదు.
Also Read:Ys Viveka Case: వైఎస్ వివేకా కేసు.. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ
ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.55,000 చొప్పున మంజూరు చేస్తుంది. రూ.55,000 గ్రాంట్లో రూ.49,000 పథకానికి అర్హులైన మహిళలకు అందజేయగా, రూ.6,000 సామూహిక వివాహాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. బచ్చర్గావ్ నివాసి అయిన ఒక మహిళ, తాను ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద వివాహం చేసుకోవడానికి ఫారమ్ను నింపినట్లు చెప్పింది. ఫారమ్ను పూరించిన తర్వాత, బజాగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు వైద్య పరీక్ష జరిగింది. వైద్య పరీక్షల సమయంలో గర్భ పరీక్ష కూడా జరిగింది. పరీక్ష సానుకూలంగా వచ్చిన తర్వాత, పథకం కింద నిర్వహించాల్సిన వివాహాల జాబితా నుండి ఆమె పేరు తొలగించబడిందని ఆమె పేర్కొంది.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
బచ్చర్గావ్కు చెందిన మరో మహిళ తనకు వైద్య పరీక్ష గురించి ఏమీ చెప్పలేదని ఆరోపించారు. జాబితాలో ఆమె పేరు ప్రస్తావించలేదు. పూర్తి సన్నాహాలతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నానని, అయితే పెళ్లి చేసుకోలేకపోయానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. గర్భ పరీక్ష మహిళలను అవమానించడమే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్ మంత్రి ఓంకార్ మార్కమ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద గర్భ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏదైనా నిబంధనలు రూపొందించి ఉంటే దానిని బహిరంగపరచాలన్నారు.
Also Read:Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత
కాంగ్రెస్ విమర్శలను బీజేపీ కౌంటిర్ ఇచ్చింది. దిండోరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అవధ్రాజ్ బిలయ్య మాట్లాడుతూ ఓంకార్ మార్కం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సామూహిక వివాహ వేడుకలకు హాజరైన కొందరు మహిళలు గర్భిణులుగా ఉన్నారని తెలిపారు. అందుకే ఈ పరీక్షలు సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు కళ్యాణ పథకంలో భాగస్వామ్యానికి సంబంధించిన ఆరు ఫారాలు తన స్థలం నుంచి పంపినట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ మేద్ని మారావి తెలిపారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద వివాహాల కోసం మహిళలకు గర్భ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు.
తాజావార్తలు
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
-
Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
-
Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Ravi Teja : ఆగస్ట్ రేస్లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
-
Sunil: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..? సునీల్ షాకింగ్ రివీల్!
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!