Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో వివాహ పథకంపై తీవ్ర దుమారం రేగుతోంది. లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడంతో వారి గర్భ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ విరుచుకుపడ్డాయి. దిండోరి జిల్లాలోని గడసరాయ్ పట్టణంలో జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద 219 జంటలకు వివాహం చేసింది. అయితే ఈ సామూహిక కళ్యాణోత్సవంలో పెళ్లికి వచ్చిన కొందరు మహిళల పేర్లు జాబితాలో కనిపించలేదు. వారి ప్రెగ్నెన్సీ టెస్ట్లు పాజిటివ్గా తేలడంతో వారి పేర్లను ప్రస్తావించలేదు.
Also Read:Ys Viveka Case: వైఎస్ వివేకా కేసు.. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ
ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.55,000 చొప్పున మంజూరు చేస్తుంది. రూ.55,000 గ్రాంట్లో రూ.49,000 పథకానికి అర్హులైన మహిళలకు అందజేయగా, రూ.6,000 సామూహిక వివాహాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. బచ్చర్గావ్ నివాసి అయిన ఒక మహిళ, తాను ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద వివాహం చేసుకోవడానికి ఫారమ్ను నింపినట్లు చెప్పింది. ఫారమ్ను పూరించిన తర్వాత, బజాగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు వైద్య పరీక్ష జరిగింది. వైద్య పరీక్షల సమయంలో గర్భ పరీక్ష కూడా జరిగింది. పరీక్ష సానుకూలంగా వచ్చిన తర్వాత, పథకం కింద నిర్వహించాల్సిన వివాహాల జాబితా నుండి ఆమె పేరు తొలగించబడిందని ఆమె పేర్కొంది.
Also Read
బచ్చర్గావ్కు చెందిన మరో మహిళ తనకు వైద్య పరీక్ష గురించి ఏమీ చెప్పలేదని ఆరోపించారు. జాబితాలో ఆమె పేరు ప్రస్తావించలేదు. పూర్తి సన్నాహాలతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నానని, అయితే పెళ్లి చేసుకోలేకపోయానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. గర్భ పరీక్ష మహిళలను అవమానించడమే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్ మంత్రి ఓంకార్ మార్కమ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద గర్భ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏదైనా నిబంధనలు రూపొందించి ఉంటే దానిని బహిరంగపరచాలన్నారు.
Also Read:Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత
కాంగ్రెస్ విమర్శలను బీజేపీ కౌంటిర్ ఇచ్చింది. దిండోరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అవధ్రాజ్ బిలయ్య మాట్లాడుతూ ఓంకార్ మార్కం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సామూహిక వివాహ వేడుకలకు హాజరైన కొందరు మహిళలు గర్భిణులుగా ఉన్నారని తెలిపారు. అందుకే ఈ పరీక్షలు సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు కళ్యాణ పథకంలో భాగస్వామ్యానికి సంబంధించిన ఆరు ఫారాలు తన స్థలం నుంచి పంపినట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ మేద్ని మారావి తెలిపారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద వివాహాల కోసం మహిళలకు గర్భ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి
-
Box Office Trend :’పెద్ది’ని అధిగమించిన ‘అబ్సెషన్’… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
-
Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
-
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!