Palla Rajeshwar Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓటమి చెందామని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 పైన ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ రంగంను పండగ చేసిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. కేసీఆర్ సర్కార్, రేవంత్ సర్కార్ కు వ్యవసాయ రంగంలో తేడాను ప్రజలు గమనిస్తున్నారు.. రుణమాఫీ విషయంలో రేవంత్ అబద్దాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు.
Off The Record: భువనగిరి బీఆర్ఎస్ పార్టీలో కంగారుకు కారణం ఏంటి ? క్యామ మల్లేష్ లెక్కలు కుదరలేదా ?
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
15 వేల రైతు బందు ఏమైంది…కేసీఆర్ ఇచ్చిన 10 వేలు రైతుబంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తాం అన్నారు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు భీమా, 24 గంటల కరెంటు, సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన నష్టం రైతులకు తెలుసు.. రేవంత్ సర్కార్ కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. న్యూట్రిషన్ కిట్స్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కాలేదని తెలిపారు. 50 వేల మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. 4వేల నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు.
Robbery: ఆడిషన్ కి వచ్చి నిర్మాతను దోచేసిన నటుడు?
జాబ్ క్యాలండర్ ఎందుకు ప్రకటించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్ని అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని… పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మోసపోయే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటా అడిగే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్, పసుపు బోర్డు అబద్దాలపై గెలిచారని.. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయితే ప్రజలు కూడా కుమ్మక్కై బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారని తెలిపారు. మరోవైపు.. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైందని, కేసీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!