నటనలో ఓ గిరి … ఓం పురి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక విలక్షణమైన పాత్రల్లో తనదైన బాణీ పలికించారు నటుడు ఓం పురి. ప్రతిభావంతులను తీర్చిదిద్దే ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వచ్చిన ఓం పురి తొలి నుంచీ తనదైన అభినయంతో ఆకట్టుకుంటూనే సాగారు. హిందీ, తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ నటించారు. ఇంగ్లిష్ లోనూ అభినయించారు. పాకిస్థాన్ సినిమాల్లోనూ ఓం పురి నటన ఆకట్టుకుంది. అంతర్జాతీయ నటునిగా పేరొందిన ఓం పురి అభినయం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.
ఓం ప్రకాశ్ పురి 1950 అక్టోబర్ 18న పంజాబ్ లోని అంబాలాలో జన్మించారు. చిన్న తనం నుంచీ ఇతరులను ఇట్టే ఆకట్టుకొనే గుణం ఓం పురిలో ఉండేది. తరువాతి రోజుల్లో నాటకాలు వేస్తూ సాగారు. ముఖంపై వచ్చిన మచ్చల వల్ల బిడియపడ్డా, తరువాత దానిని అధిగమిస్తూ నటనలో వైవిధ్యం చూపించారు ఓం పురి. ‘ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో చేరి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. తరువాత ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరిన తరువాత మరింతగా రాటు దేలారు పురి. అక్కడ నుండి వచ్చాక ముంబై చేరి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. తనకు లభించిన చిన్న, చితక పాత్రల్లోనూ నటించేశారు. ‘శోధ్’ హారర్ సినిమా ఓం పురికి నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. అంతకు ముందు శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘భూమిక’ చిత్రంలో ‘ఈవిల్ కింగ్’ అనే రంగస్థల నటునిగా నటించారు. శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన “కల్ యుగ్, ఆరోహణ్, మండీ” చిత్రాలలో కనిపించారు ఓం పురి. గోవింద్ నిహలానీ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆక్రోష్’లోనూ, తరువాత రూపొందించిన ‘అర్ధ్ సత్య’లోనూ ఓం పురి అభినయం అందరినీ ఆకట్టుకుంది. “అగాథ్, ద్రోహ్ కాల్, న్యూ ఢిల్లీ టైమ్స్, ఘాయల్, దేవ్” వంటి చిత్రాలలోనూ ఓం పురి నటన అలరించింది.
Also Read
తెలుగులో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రాత్రి’లో షార్జీ పాత్రలో భూతాలను వదిలించేవాడిగా నటించారు. ఇక ఉమామహేశ్వరరావు తెరకెక్కించిన ‘అంకురం’లోనూ సత్యం అనే ప్రధాన భూమిక ధరించారు. శ్యామ్ బెనెగల్ ‘ఆరోహణ్’తో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు ఓం పురి. గోవింద్ నిహలానీ ‘అర్ధ్ సత్య’తో రెండోసారి నేషనల్ అవార్డ్ అందుకున్నారాయన. శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘భారత్ ఏక్ ఖోజ్’ డాక్యుమెంటరీకి ఓం పురి వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. “గాంధీ, సిటీ ఆఫ్ జాయ్, వూల్ఫ్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్” వంటి ఆంగ్ల చిత్రాలలోనూ ఓం పురి నటించి ఆకట్టుకున్నారు.
తెరపై విలక్షణ పాత్రలు పోషించి అలరించిన ఓం పురి, నిజజీవితంలో మంచి భర్త అనిపించుకోలేక పోయారు. 1991లో సీమా కపూర్ ను వివాహమాడారు. కొద్ది రోజులకే విడిపోయారు. ఆ తరువాత 1993లో నందితను పెళ్ళాడారు. వారికి ఇషాన్ పురి అనే అబ్బాయి ఉన్నాడు. 2013లో ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని అంధేరిలో ఉన్న తన నివాసంలో నిద్రలోనే 2017 జనవరి 6న కన్నుమూశారు ఓం పురి. ఈ నాటికీ రంగస్థలంపైనా, చిత్రసీమలోనూ ఓం పురి విలక్షణ పాత్రల గురించి చర్చ సాగుతూనే ఉంది. ఔత్సాహిక నటులు ఓం పురి చిత్రాలను అధ్యయనం చేయడమూ జరుగుతోంది. ఏది ఏమైనా భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఓం పురి నిలచిపోయారు.
తాజావార్తలు
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?