కొండపై సామాన్యులకేనా రూల్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా?
ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు తిరుమల వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని.. ఆ సమయంలో కలిగే దివ్యానిభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. కానీ.. ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే TTDనే అంచెలంచెలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60-70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదు.
Also Read
కరోనా ఆంక్షలు సామాన్య భక్తులకేనా?
కోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు కూడా ఒకవైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తూతం 30-40 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూన్నా.. అవన్నీ ఆన్లైన్లో కేటాయిస్తున్నవే. సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నా.. సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్లైన్లో సంపన్నులుతో పోటి పడి దర్శనం టికెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్లైన్లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్ అడ్డొస్తోంది. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా.. వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వీఐపీ బ్రేక్ దర్శనాలపై నియంత్రణ లేదు
తిరుమలలో రోజూ సిఫారసు లేఖలపై VIP బ్రేక్ దర్శనాలను… ఆఫ్లైన్లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. ఆ టికెట్ల సంఖ్య తగ్గించలేదు. పైపెచ్చు వాటి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్లో కేటాయిస్తున్నా.. గతంతో పోల్చితే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకి 18-20 వేల టికెట్లు జారీ చేయగా..ప్రస్తుతం 20-25 వేల వరకూ ఉంటోంది. వర్చువల్ సేవా టికెట్లు, సుపథం టికెట్లు.. ఇలా ఎక్కడా ఆ వర్గాలకు కోత లేదు. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యని TTD పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకి 30-50 వేలమంది సామన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు పదివేలే. అదీ ఆన్లైన్లోనే అందిస్తోంది TTD.
వీఐపీ టికెట్ల కోసం గుమిగూడితే కోవిడ్ వ్యాప్తి చెందదా?
సామాన్య భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే.. వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని TTD హడలిపోతోంది. అయితే VIP టికెట్ల కోసం MBC వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో TTDనే చెప్పాలి. వైకుంఠ ఏకాదశి రోజున VVIPల పేరుతో జరిగిన హడావిడి కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లిన సమయంలో కానీ.. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యమనే మాటను మాటలకే పరిమితం చేసి.. పెద్దలను ఒకలా.. సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!