కొండపై సామాన్యులకేనా రూల్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా?
ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు తిరుమల వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని.. ఆ సమయంలో కలిగే దివ్యానిభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. కానీ.. ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే TTDనే అంచెలంచెలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60-70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
కరోనా ఆంక్షలు సామాన్య భక్తులకేనా?
కోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు కూడా ఒకవైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తూతం 30-40 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూన్నా.. అవన్నీ ఆన్లైన్లో కేటాయిస్తున్నవే. సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నా.. సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్లైన్లో సంపన్నులుతో పోటి పడి దర్శనం టికెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్లైన్లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్ అడ్డొస్తోంది. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా.. వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వీఐపీ బ్రేక్ దర్శనాలపై నియంత్రణ లేదు
తిరుమలలో రోజూ సిఫారసు లేఖలపై VIP బ్రేక్ దర్శనాలను… ఆఫ్లైన్లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. ఆ టికెట్ల సంఖ్య తగ్గించలేదు. పైపెచ్చు వాటి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్లో కేటాయిస్తున్నా.. గతంతో పోల్చితే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకి 18-20 వేల టికెట్లు జారీ చేయగా..ప్రస్తుతం 20-25 వేల వరకూ ఉంటోంది. వర్చువల్ సేవా టికెట్లు, సుపథం టికెట్లు.. ఇలా ఎక్కడా ఆ వర్గాలకు కోత లేదు. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యని TTD పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకి 30-50 వేలమంది సామన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు పదివేలే. అదీ ఆన్లైన్లోనే అందిస్తోంది TTD.
వీఐపీ టికెట్ల కోసం గుమిగూడితే కోవిడ్ వ్యాప్తి చెందదా?
సామాన్య భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే.. వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని TTD హడలిపోతోంది. అయితే VIP టికెట్ల కోసం MBC వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో TTDనే చెప్పాలి. వైకుంఠ ఏకాదశి రోజున VVIPల పేరుతో జరిగిన హడావిడి కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లిన సమయంలో కానీ.. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యమనే మాటను మాటలకే పరిమితం చేసి.. పెద్దలను ఒకలా.. సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!