దేశవ్యాప్తంగా పేదరికంలో బీహార్ టాప్… ఏపీ, తెలంగాణ సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ (37.79 శాతం), మధ్యప్రదేశ్ (36.65 శాతం), మేఘాలయా (32.67 శాతం) ఉన్నాయి.
Read Also: ఉద్యోగం ఇప్పిస్తానని వ్యభిచారంలోకి.. 11 ఏళ్లుగా చిత్రహింసలు పెడుతూ
Also Read
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిరుపేదల జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో, ఏపీ 20వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 13.74 శాతం మంది పేదలు ఉన్నారని… ఏపీలో 12.31శాతం మంది పేదలు ఉన్నారని నీతి ఆయోగ్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ తెలిపింది. మరోవైపు నిరుపేదలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో 0.71 శాతం మాత్రమే పేదలు ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆ తర్వాత గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం), పంజాబ్ (5.59 శాతం) ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!