బీజేపీలో కొత్త ట్రెండ్.. యాక్షన్ తో వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. గతంలో.. పద్ధతి.. పద్ధతి.. అని చెప్పినట్టుగా కాకుండా.. ఇక తేడా వస్తే.. తోక కట్ చేయడమే.. అన్నట్టుగా నిర్ణయాలు అమలు చేస్తోంది. కొంత కాలంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు సైతం ఈ కోవకే చెందుతుంది. పార్టీ లైన్ కు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. శ్రేణులను సమర్థంగా నడిపించలేకపోతున్నా.. అధిష్టానం ఏ మాత్రం కనికరించడం లేదు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా.. పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఉత్తరాదినే కాదు.. దక్షిణాదిపైనా ఫోకస్ చేస్తోంది. ఫైర్ బ్రాండ్ అయిన అమిత్ షా.. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రాలను సందర్శిస్తూ.. పార్టీ స్థానిక నాయకత్వాలకు క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తున్న తీరును కూడా చూస్తున్నాం. త్వరలోనే.. ఆయన తెలంగాణలోనూ పర్యటించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం.. యూపీ నేతలతో భేటీ అయ్యారు.
Also Read
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
ఇతర నేతలు గుజరాత్ పై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ.. ఢిల్లీ నుంచే మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అమిత్ షా తో పాటు.. ఇతర వ్యూహకర్తలు.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ నాయకత్వ అడుగులు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లోనూ అవసరాన్ని బట్టి మార్పులు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీతో పాటు.. తెలంగాణపైనా ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టడమే ఇందుకు కారణమవుతోంది.
ముఖ్యంగా.. తెలంగాణలో పార్టీకి ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ ను కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఆంధ్రాలో టీడీపీని దాటి కనీసం రెండో స్థానానికైనా చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జనసేనతో కలిసి నడవడం ఇందుకే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో.. అటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లకు.. ముందు ముందు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారు.. పార్టీ లక్ష్యాలను ఎలా చేరుకుంటారు.. అన్నది ఆసక్తికరంగా మారింది. లక్ష్యాలు చేరుకోలేకపోతున్న నేతల విషయంలో.. బీజేపీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా.. చర్చల్లో భాగం పంచుకుంటోంది.
తాజావార్తలు
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!