బీజేపీలో కొత్త ట్రెండ్.. యాక్షన్ తో వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. గతంలో.. పద్ధతి.. పద్ధతి.. అని చెప్పినట్టుగా కాకుండా.. ఇక తేడా వస్తే.. తోక కట్ చేయడమే.. అన్నట్టుగా నిర్ణయాలు అమలు చేస్తోంది. కొంత కాలంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు సైతం ఈ కోవకే చెందుతుంది. పార్టీ లైన్ కు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. శ్రేణులను సమర్థంగా నడిపించలేకపోతున్నా.. అధిష్టానం ఏ మాత్రం కనికరించడం లేదు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా.. పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఉత్తరాదినే కాదు.. దక్షిణాదిపైనా ఫోకస్ చేస్తోంది. ఫైర్ బ్రాండ్ అయిన అమిత్ షా.. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రాలను సందర్శిస్తూ.. పార్టీ స్థానిక నాయకత్వాలకు క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తున్న తీరును కూడా చూస్తున్నాం. త్వరలోనే.. ఆయన తెలంగాణలోనూ పర్యటించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం.. యూపీ నేతలతో భేటీ అయ్యారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ఇతర నేతలు గుజరాత్ పై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ.. ఢిల్లీ నుంచే మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అమిత్ షా తో పాటు.. ఇతర వ్యూహకర్తలు.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ నాయకత్వ అడుగులు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లోనూ అవసరాన్ని బట్టి మార్పులు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీతో పాటు.. తెలంగాణపైనా ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టడమే ఇందుకు కారణమవుతోంది.
ముఖ్యంగా.. తెలంగాణలో పార్టీకి ఇప్పుడున్న పాజిటివ్ వేవ్ ను కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఆంధ్రాలో టీడీపీని దాటి కనీసం రెండో స్థానానికైనా చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జనసేనతో కలిసి నడవడం ఇందుకే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో.. అటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లకు.. ముందు ముందు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారు.. పార్టీ లక్ష్యాలను ఎలా చేరుకుంటారు.. అన్నది ఆసక్తికరంగా మారింది. లక్ష్యాలు చేరుకోలేకపోతున్న నేతల విషయంలో.. బీజేపీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా.. చర్చల్లో భాగం పంచుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!