ఏపీకి కొత్త పీసీసీ చీఫ్..! రేసులో ఉంది వీరే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీతో మరోవిడత ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారని సమాచారం.
సెప్టెంబర్ మొదటి వారంలో సమాలోచనల తర్వాత నిర్ణయం కొత్త పీసీసీ చీఫ్పై ఏఐసీసీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.. కొత్త నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ కు నిర్దిష్టమైన కార్యాచరణను నిర్దేశించనుంది ఏఐసీసీ.. మరోసారి సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీకి చెందిన మరికొంత మంది ముఖ్య నేతలను ఢిల్లీ కి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపు అందినట్టుగా సమాచారం.. నేరుగా ఏపీ ముఖ్యనేతల అభిప్రాయాలను తెలుసుకుని, అంతిమంగా నిర్ణయం తీసుకోనున్నారు రాహుల్ గాంధీ.. కాగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో ఉన్నారు.. రాష్ట్ర నేతల అభిమతం మేరకు ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డా. చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సెక్రటరీ జేడీ శీలం, మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్లను ఏపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీ సిఫార్సు చేసినట్లు సమాచారం.. ఇటీవల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో, జిల్లా స్థాయు నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు ఉమెన్ చాందీ, ఇంఛార్జ్ సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టోఫర్.. వారి అభిప్రాయాలను అధిష్టానానికి ఇప్పటికే చేరవేశారు. తెలంగాణకు కొత్త చీఫ్ను ప్రకటించిన పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచిన అధిష్టానం.. ఇప్పుడు.. ఏపీ చీఫ్గా ఎవరిని నియమిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
తాజావార్తలు
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!