భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అవుతోంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఓ మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. వర్షాల వల్ల రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
అప్పుడే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విశేషంగా స్పందించారు. ఆ వ్యక్తిని అక్కడినించి తరలించేందుకు సరైన వాహనాలు అందుబాటులో లేవు. వెంటనే స్పందించిన మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరి ఆ వ్యక్తిని భుజాలపై మోసుకెళ్ళి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె చేసిన సేవకు సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి.