టీడీపీ కార్యకర్త సైదాను దారుణంగా కొట్టారు.. వీడియో షేర్ చేసిన లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: తాలిబాన్లను మించిపోతున్న వైసీపీ ఆగడాలు: అచ్చెన్నాయుడు
Also Read
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్గా పనిచేశాడన్న కక్ష్యతో వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారి దారుణంగా కొట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ దాడి ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందంటూ లోకేష్ మండిపడ్డారు. పొలం తగాదా నెపంతో వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని.. రాష్ట్రంలో వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిద్రపోతుంటే… వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని లోకేష్ ఘాటుగా విమర్శించారు. కాగా వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!