టీడీపీ కార్యకర్త సైదాను దారుణంగా కొట్టారు.. వీడియో షేర్ చేసిన లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: తాలిబాన్లను మించిపోతున్న వైసీపీ ఆగడాలు: అచ్చెన్నాయుడు
Also Read
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్గా పనిచేశాడన్న కక్ష్యతో వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారి దారుణంగా కొట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ దాడి ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందంటూ లోకేష్ మండిపడ్డారు. పొలం తగాదా నెపంతో వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని.. రాష్ట్రంలో వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిద్రపోతుంటే… వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని లోకేష్ ఘాటుగా విమర్శించారు. కాగా వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!